పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

205


తే.

స్థూల మయ్యును సూక్షమై తోఁచువాఁడు
తరుణుఁ డయ్యును బాలుఁడై తనరువాఁడు
చంద్రికాయుక్తిఁ జెన్నొందు చంద్రుమాడ్కి
మించి లక్ష్మియుఁ దానుఁ గ్రీడించువాఁడు.

113


వ.

కందర్పకోటిసుందరుండై యిందిరాసుందరితోడం బరమానం
దంబు నొంది పరమపదంబునందుండు పరమవ్యోమంబు నిత్య
భోగాస్పదం బగుటం జేసి భోగవిభూతి మూఁడుపాదంబులు
గల్గి నిత్యంబై యుండు భువనంబు లన్నియు నతండు నిర్మిం
చుచు నుపసంహరించు చునికిం జేసి యనిత్యంబై లీలావిభూతి
పాదమాత్రంబై విలసిల్లు నయ్యుభయవిభూతులు నప్పురు
షోత్తముండు తనశక్తిపెంపున వరియించుచుండు.

114


ఆ.

అట్టి పరమపదమునం దచ్యుతుఁడు తన
సతులు సిరియు ధరయు సమదలీలఁ
దన్నుఁ గొలిచియుండ నున్నతసౌఖ్యంబు
ననుభవించుచుండు ననుదినంబు.

115

లక్ష్మీస్తవము :

క.

వనజాక్షుఁడు సర్వాత్మల
ననువున విహరించునట్టు లాతనితనువం
దనపాయినియై మన్మథ
జననియు విహరించు నెల్లజగములయందున్.

116


సీ.

ఎల్లలోకములకు నీశాన హరిపత్ని
        సర్వతోముఖ శిరశ్చరణపాణి
నయన సదాశివ నారాయణీ శక్తి
       సర్వజగన్మాత సౌమ్యమూర్తి