పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

పద్మపురాణము


క.

నిర్మలమతి యగు శిష్యుని
కర్మిలిఁ దద్గురువు తప్తమగు మంత్రవిధిన్
నిర్మించి యూర్ధ్వపుండ్రము
పేర్మిగ నిడి వైష్ణవంపుఁ బేరిడి పిదపన్.

102


సీ.

న్యాసంబ యొండె నష్టాక్షరి యొండెను
        మఱియొక్కవైష్ణవమంత్ర మొండెఁ
జెప్పి యాచార్యుండు శిష్యుని బోధింప
        వలయు మంత్రముల లోపలఁ బ్రపత్తి
బరమంబు వైష్ణవప్రతతి కెల్లప్పుడు
        సద్ద్విజశ్రేణి కాశ్రయముఁ దాన
ద్వయమునకంటెను బరమైన మంత్రంబు
        లేదు తథ్యం బిది లేమ! వినుము


ఆ.

ధరఁ బ్రపత్తి యనఁగ ద్వయము నాన్యాసంబు
నాఁగ [1]మఱియుఁ బెక్కునామవితతి
గల ప్రపత్తి గురుఁడు తొలుత నెఱింగించి
సర్వకర్మములను జరపవలయు.

103


క.

న్యాసాధికారి మంత్ర
న్యాసంబుల కెల్ల నర్హుఁ డగు నట్లగుటన్
భూసురవరుఁ దన్మంత్రా
భ్యాసిం గావించి పిదప నగు నెఱిఁగింపన్.

104


క.

శ్రీమహితాష్టాక్షరి యను
నామంత్రము నభ్యసింప నగు విప్రున క
ట్లే మంత్ర మష్టవర్ణని
యామకమై ప్రణవపూర్వమై విలసిల్లున్.

105
  1. నదియు (హై)