పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

201


వ్యంబు. రాజులకు వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ పురుషోత్తమ
నామంబులు దలంచుచు ఫాలంబున వక్షంబున భుజంబుల నిడ
వలయు. వైశ్యులకు గోవిందనామంబుల నిటలంబున నుదరం
బున ధరియించునది కర్తవ్యంబు. శూద్రస్త్రీజనంబులకు నారా
యణ నామంబుల నొసల నిడవలయు. ఈప్రకారంబున సకల
జనంబులకు నూర్ధ్వపుండ్రంబు ధరియింపవలయు.

96


ఆ.

హరిపదాకృతియును నలరు దండాకార
ముగ ధరించు టధికమోక్షదంబు
పద్మముకుళబోధిపత్రవంశచ్ఛదా
కారములను వశ్యకరము లబల!

97


మ.

కరమూలంబులఁ జక్రచిహ్నితములున్ [1]గంఠప్రదేశంబుల
న్వరపద్మాక్షవిశాలమాలికలు శ్రీవత్సాంకనామంబులం
గర మొప్పారెడు నూర్ధ్వపుండ్రకములుం గాత్రంబునం బొల్చున
ప్పురుషు ల్సర్వజగంబుఁ బుణ్యగతులం బొందింతు రబ్జాననా.

98


వ.

అని యూర్ధ్వపుండ్రధారణమహత్వంబు చెప్పి శంకరుండు గిరిరాజనందన కిట్లనియె.

99

శ్రీమదష్టాక్షరీమంత్రప్రభావము :

తే.

న్యాసమున నొండెఁ దా నర్చనమున నొండె
నెపుడు నేకాంతియై మంత్ర మెఱుఁగవలయు
నది యవైష్ణవుచే దీక్ష యయ్యెనేని
ఫలము లేదు పునర్దీక్ష వలయుఁ జేయ.

100


ఉ.

వేదములుం దదంగములు వేయుఁ బఠించి మఘంబు లెల్ల న
త్యాదరలీలఁ జేసి విపులాన్వయుఁడైనను వైష్ణవుండు మం
త్రాదులయం దయోగ్యుఁ డగు నట్లగుటన్ భవమోచనార్థ మేఁ
డాది భజించెనేని గురుఁ డాతని కీఁదగు మంత్ర మిమ్ములన్.

101
  1. గండ (ము)