పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

187

ద్వయానుసంధాన విధానము :

సీ.

విను వత్స! యీమంత్రమునకు దీక్షావిధి
        కర్హుఁ డాచార్యుఁడౌ నతఁడు వేద
శాస్త్రసంపన్నుండు సత్యవ్రతుఁడు విష్ణు
        భక్తుఁడు మంత్రార్థపారగుండు
గతమత్సరుం డనాగతవేది మంత్రజ్ఞుఁ
        డతిముముక్షుఁడు విప్రుఁ డమలచరితుఁ
డనఘుఁడు బ్రహ్మవిద్యాసమర్థుం డరి
       దమనుండు సత్సంప్రదాయనిరతుఁ


తే.

డతులితాచారశాసనుఁ డగుటఁ జేసి
యట్టి పుణ్యుని నాచార్యుఁ డండ్రు పెద్ద
లతని యాజ్ఞకు మిగులక యనుదినంబుఁ
దత్పరాధీనుఁడై భక్తిఁ దనరునట్టి
ఘనుని నుత్తమశిష్యునిఁగా నెఱుంగు.

29


వ.

అట్టి సత్త్వగుణనిష్ఠుండగు శిష్యునకు నిమ్మంత్రరత్నం బుపదే
శింపవలయుఁ దత్ప్రకారం బెట్టిదనిన.

30


తే.

శ్రవణమున నొండె ద్వాదశిఁ దివిరి యొండె
వైష్ణవంబగు శోభనవాసరమున
నొండె నాచార్యసేవనాయుక్తుఁ డగుచు
దీక్షఁ గైకొనవలయు సురక్షితముగ.

31


క.

కనకమున నొండె రజతం
బున నొండెను రాగి నొండె మొగిఁ గంచున నొం
డెను చక్రము శంఖంబును
నొనరింపఁగ వలయు శాస్త్రయుక్తము గాఁగన్.

32


తే.

వినుము! పంచామృతస్నాన మొనరఁ జేసి
నాదు సన్నిధి గంధపుష్పాదివిధుల
చేతఁ దన్మంత్రమునఁ బూజచేసి యచట
నొనర గృహ్యోక్తవిధి నగ్ని యునుపవలయు.

33