పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

పద్మపురాణము


శ్రీశుండు నిత్యసుశీలుండు సుభగుండు
         సర్వబంధుఁడు గృపాసాగరుండు
నైన శ్రీ నారాయణాఖ్యుండు దేవత
         ఛందంబు గాయత్రిసాంగ మగుచుఁ


తే.

బంచవింశతివర్ణాళి వఱఁగునందు
మొదల రెండును నే డాఱు మూఁడు నైదు
మఱియు రెండు షడంగసమ్మతము సేసి
న్యాస మొనరింపవలయుఁ బర్యాయ మెసఁగ.

25


మ.

సతతశ్రీయుతవామభాగలసితుం జక్రాబ్జకౌమోదకీ
సితపద్మాంకితదోశ్చతుష్టయు లసచ్ఛృంగారదివ్యాంబరాం
చితదేహు న్మణిదివ్యభూషణు ననుం జింతించి సద్గంధవ
స్త్రతతిం బూజలుసేయు నిత్యమును మంత్రజ్ఞుండు శుద్ధాత్ముఁడై.

26


వ.

ఈప్రకారంబున విశ్వరూపధరుండగు నన్ను నియతాత్ముండై
యీమంత్రంబున నొక్కమాటు పూజించిన సంతుష్టాంతరంగుం
డనై యభిమతంబు లిత్తు ననిన నారాయణునకు శతానందుం డి
ట్లనియె.

27


సీ.

సర్వదైవములును జననియు జనకుండు
        పతియు సఖుండును గతియు గురుఁడు
చుట్టంబు శరణు దోఁబుట్టువులును నీవ
        జనుల కభీష్టార్థజనక మయ్యు
నతిరహస్యంబగు నమ్మంత్రరత్నప్ర
        భావంబుఁ దెలిపితి దేవదేవ!
యే నీకు దాసుఁడ సూనుండ శిష్యుఁడఁ
       గారుణ్యజలధివిఁ గాన నిన్ను


తే.

నిపుడు వేఁడెద నిమ్మంత్ర మెల్లనాఁడు
నఖిలలోకోపకారార్థమైన దాని
దీక్షగొను భంగి నంతయుఁ దెలియఁ జెప్పు
మనిని విని యాదిపురుషుఁ డిట్లనియెఁ బ్రీతి.

28