పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

పద్మపురాణము


క.

కావున నీ మహితత్త్వం
బీ వడిగిన యర్థమెల్ల నితిహాసవిధం
బై వెలయ నీకుఁ జెప్పితి
నే విన్నవిధంబుఁ దెలియ నిద్ధచరిత్రా!

185


క.

ఇది సర్వధర్మమూలము
మది వదలక యెఱిఁగి మాఘమాసస్నానం
బొదవఁగఁ జేయుము నీ క
భ్యుదయం బగు నాకసౌఖ్య మొందు నరేంద్రా!

186


వ.

అని యిట్లు మాఘమాహాత్మ్యంబు సవిస్తరంబుగాఁ జెప్పిన వసిష్ఠ
మునీంద్రునకు సాష్టాంగదండనమస్కారం బాచరించి దిలీప
భూపాలుం డయ్యా! నీ ప్రసాదంబునఁ గృతార్థుండ నై తినని
కృతాంజలియై యమ్మహాత్ముని వీడ్కొని రథం బెక్కి సపరివారం
బుగా నయోధ్యానగరంబునకు వచ్చి సుదక్షిణాసహితుండై పురో
హితపురస్పరంబుగాఁ బ్రయాగకుం జని విధివంతంబుగా మాఘ
మాసంబునం బ్రతిదివసంబునుం గృతస్నానుండై విప్రవరులకు
యథోచితదానంబు లొసంగి నిత్యవ్రతంబు లాచరించి కృతకృ
త్యుండై పురంబునకుం జని సుఖంబుండె నంత నొక్కనాడు.

187


చ.

పరమవివేకసాగరుఁడు పంకజసంభవసన్నిభుండు ధూ
మరహితవహ్నితుల్యుఁ డసమానతపోనిధి విష్ణుభక్తిత
త్పరుఁ డఘసంఘదూరుఁడు గృపారసచిత్తుఁడు దివ్యబోధసు
స్థిరుఁడగు నవ్వసిష్ఠుఁ డరుదెంచె దిలీపనృపాలుపాలికిన్.

188


తే.

ఇట్లు వచ్చిన యమ్ముని కెదురు నడచి
భక్తిఁ బ్రణమిల్లి దోడ్తెచ్చి భద్రపీఠి
యందుఁ గూర్చుండ నియమించి యర్ఘ్యపాద్య
విధులఁ బూజించి యా రాజవిభుఁడు ప్రీతి.

189