పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

పద్మపురాణము


నిండారు నీ మూఁడు గుండంబులందును
         ద్రేతాగ్ను లెప్పుడుఁ దేజరిల్ల
నింద్రాదిదేవత లేతెంచి యజ్ఞభా
         గము లొంది సోమపానములు సేయఁ


ఆ.

గేల శూల మమర ఫాలనేత్రాంశులు
దిక్కులెల్ల నిండ నక్కజముగ
నద్రిజాధినాథుఁ డావిర్భవము నొందె
నింద్రసేవ్యుఁ డగుచు నిచటఁ దొల్లి.

158


క.

ఇది యసితతోయవేణీ
సదుపాశ్రయ వినుము దీని జలపానమునన్
ద్రిదశేంద్ర లోక[1]సఖ్యం
బొదవు నరోత్తముల కెపుడు నుత్తమచరితా!

159


సీ.

అవిముక్తమునఁ దారకాహ్వయ సుజ్ఞాన
         మునఁ గాని నరులకు ముక్తిలేదు
జ్ఞానహీనుల కైనఁ బూని సితాసిత
        స్నానమాత్రమున మోక్షంబు గలుగు
సృష్ట్యాది క్రతువులు చేసి ప్రజాపతి
       యిచ్చట సృజియించె నెల్ల జగము
రాజాస్యకై యీనదీజ స్నాతుఁడై
       యంబుజాక్షుఁడు లక్ష్మి నధిగమించె


ఆ.

జయము గోరి తొల్లి షణ్మాసములు శూలి
యీ జలావగాహ మెలమిఁ జేసి
తత్ప్రభావమునను దానవపురములు
కూలనేసె నొక్కకోల దొడగి.

160
  1. సౌఖ్యం (తి)