పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

పద్మపురాణము

బ్రహ్మరాక్షసుఁడు కాంచనమాలినితోఁ దనపూర్వవృత్తాంతము చెప్పుట :

చ.

అన విని బ్రహ్మరాక్షసుఁడు నాసతి కిట్లను దల్లి! నీదు వ
ర్తనము పవిత్రమైన గతిఁ దప్పక చెప్పఁగ విన్నమాత్ర నా
మనము ప్రసన్నమయ్యె గరిమన్ స్ఫుటసజ్జనగోష్ఠి నేరికిన్
ఘనతరసౌఖ్యసంపదలు గల్గుట నిక్కముగాదె యెచ్చటన్.

84


వ.

అట్లు గావున నిఖిలదోషంబులకు మూలంబైన నా తెఱంగు విను
మని బ్రహ్మరాక్షసుం డిట్లనియె.

85


సీ.

విశ్వేశనిలయమై వెలయుఁ గాశీపురి
        బ్రాహ్మణాన్వయుఁడ దుర్భాగ్యయుతుఁడ
దోషంబు దలఁపక దుర్దానములు గొని
       ధనలోభమునఁ జేసి తగవు విడిచి
చండాలుఁ డిచ్చిన నొండు దలంపక
       తివిరి యేదైనఁ బ్రతిగ్రహింతు
నవిముక్తతీర్థంబునందు నెల్లప్పుడుఁ
       బాపంబు సేయుదుఁ బ్రతిదినంబుఁ


తే.

బొరి పరాన్నంబు భుజియింపఁ బోదుఁ గాని
దేవపైతృకములఁ జేయఁ దీర దెపుడు
నొకనికై తీర్థ మాడుచునుందుఁ గాని
యెట్టిదినమున నొకగ్రుంకు పెట్టుకొనను.

86


వ.

ఇవ్విధంబునఁ గాలంబుఁ బుచ్చుచుండ ననేకవత్సరంబులు
జరిగిన పిదపఁ దత్క్షేత్రంబున శరీరంబు విడిచినకతంబున నరక
లోకంబునకుఁ దొలంగితి నది యెట్లనిన.

87


క.

పెఱచోఁ జేసిన పాపము
లఱుమక యయ్యెడ నడంగు నవిముక్తమునం
గుఱుకొని చేసిన యఘములు
కఱగొని దృఢవజ్రలేపకంబగుఁ దరుణీ!

88