పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

పద్మపురాణము


క.

ఇవ్విధమున దివిజాధిపుఁ
డవ్వెలఁదుకఁ బొందఁ గాన కారటపడఁగా
నెవ్వగలఁ దొలఁగిపోయిన
యివ్వడువున నినుఁడు పశ్చిమాంబుధిఁ గ్రుంకెన్.

22


క.

అఱసంజవేళఁ జుక్కలు
దఱిదఱిఁ బొడచూపెఁ గలువతండము విరిసెన్
నెఱి నగ్నిహోత్ర గృహముల
కఱిముఱిఁ జని వేల్వఁ దొడఁగి రమ్మునిముఖ్యుల్.

23


వ.

అప్పుడు.

24


క.

కనువిచ్చుటయును మోడ్చుట
యును సరిగా నుయ్యి కొండయును నొక్కటియై
తనరి పెనుసూదిఁ బొడిచినఁ
జినుఁగక యతినిబిడ మగుచుఁ జీఁకటి పర్వెన్.

25


వ.

అంత ననుష్ఠానాధ్యయనంబులు చాలించి మునిజనంబు లయ్యై
యెడల విశ్రమించిరి గౌతముండు నహల్యాసహితుండై నిజ
గృహంబున నుండె నప్పుడు.

26


క.

ఇది దోషము గర్హణ మని
మదిఁ దలఁపక యెఱుక లేక మన్మథవశుఁడై
త్రిదశేంద్రుఁడు దను పంచన
నొదిఁగిలి మునియింట దండ నొక్కఁడ యుండెన్.

27


సీ.

నందనాభ్యంతరమందారములనీడఁ
       జింతామణులవేదిఁ జెలువు మిగిలి
రంభాదిదేవతారమణులు సేవింప
       గంధర్వకిన్నరగాన ములియఁ
బౌలోమికుచగంధబంధురవక్షుఁడై
       పొసఁగ వాచస్పతి బుద్ధి వినుచు
సకలదిక్పాలకమకుటరత్నప్రభా
       లలితాంఘ్రితలుఁడైన బలరిపునకు