పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

85


వ.

అప్పట్టణంబునందు.

205


ఆ.

వారసతులలోన వాచాల యనుపేరు
గలిగి ప్రౌఢకాంత వొలుచునట్టి
లలనపుత్త్రి నే విలాసిని యనుపేర
బొలుతు నఖిలభోగభాగ్యములను.

206


వ.

మజ్జననికి నొక్కపుత్త్రి నగుటం జేసి యత్యంతప్రేమాతిశయం
బున నన్నుఁ బెనుచుచు.

207


ఆ.

ఆటపాట గఱపి యంగంబు వోషించి
నృత్యకళలయందుఁ నిపుణఁ జేసి
పెనుచు దినములందుఁ బ్రేమతో శశిరేఖ
కరణిఁ బెంచెఁ దల్లి గౌరవమున.

208


వ.

అప్పుడు.

209


చ.

పలుకులు ముద్దులం జిలుక వాలినఁ గందెడు మేనుఁ జేరలం
తలు గల కన్నులుం జిఱుత తాళపుదోయి నెదుర్చుఁ జన్నులుం
దిలకముఁ జూచు నున్గురులుఁ దిన్ననిమోమును గల్గి యెల్లెడన్
వలపులప్రోవ నైతి విటవర్గము చూడ్కికి బాల్యసంపదన్.

210


వ.

అంత.

211


క.

హరువుగల విప్రతనయుల
దొరకొమరుల వైశ్యసుతులఁ దోడ్తెచ్చి ననున్
మరగించి యల్లఁ బడయఁగఁ
బురికొలిపెను జనని వలఁపు పొలియక యుండన్.

212


తే.

అంతకంతకుఁ దనుకాంతి యతిశయించి
నవకమెక్కిన పువుఁదీఁగె యనువుదోఁపఁ
బల్లవావలి మనములు పెల్లగిలఁగ
నెల్ల సౌభాగ్యములకు నే నెల్ల నైతి.

213