పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

పద్మపురాణము


క.

నీ వచనాకర్ణనమున
భావింపఁగ నాకుఁ బుణ్యపాపము లెఱుఁగం
గా వచ్చె నేఁ గృతార్థుఁడ
నై వెలసితి ధర్మదూత! యఖిలవినీతా!

157


ఆ.

నరకగామియైన నా యన్నయును నీ ప్ర
సాదమహిమఁ జేసి సాదరమున
నచటు వెడలివచ్చె నతఁడు వీఁడని చూపి
యాతఁ డనుప నరిగి రమరపురికి

158


వ.

ఇట్లు నరకంబు వెలువడి వైశ్యకుమారు లిరువురు దివ్యశరీరులై
యమరలోకంబునకుం జని యింద్రభోగంబు లనుభవించుచుండిరి.
దేవదూతయు సమవర్తి సన్నిధికిం జనియె నని చెప్పి దత్తాత్రే
యుండు

159


క.

ఈ యితిహాసం బే నరుఁ
డాయతమతితోఁ బఠించు నాతఁడు సుకృత
శ్రేయోయుతుఁడై యమపుర
మే యుగములఁ జూఁడఁ జనక యిచ్చ జరించున్.

160


వ.

అనిన విని కార్తవీర్యుం డమ్మహాముని కిట్లనియె.

161

మాఘమాసప్రభావము :

సీ.

అయ్య! నీ చెప్పిన యా యితిహాసంబు
        మాఘమజ్జనము సామర్థ్యమెల్లఁ
దెలిసె వెండియు వినవలతు నా కెఱిఁగింపు
        మనిన నమ్ముని సెప్పె నతనితోడఁ
బూతంబు శుచియును బొరి నిసర్గంబును
       దావలంబును మఱి దాహకంబు
జీవకోటికి నెల్ల జీవనాఢ్యంబైన
       యా రూపు విష్ణుమయంబ యనుచు