పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

అతిరోషోద్భటుఁ డాహిరణ్యకశిపుం డాటోపతేజోమహో
ద్ధతి హుంకారము సేయునంతనె భయోద్ర్భాంతిన్ వణంకెన్ శచీ
పతి; భూభృద్గహనాంతరాళపతి విభ్రంశంబు దాల్పించె దే
వతలెల్లం జలియించి మ్రొక్కిరి భయవ్యాలోలచిత్తంబులన్.

45


క.

మునివరులు ధ్యానయజ్ఞజ
పనియమసముపాసనములు పాటింపక యా
తని మనసు వట్టి మధుసూ
దనువైభవ మాత్మయందె తలఁచిరి భీతిన్.

46


క.

అతిదుఃఖశీలుఁ డని విని
యతనిని నిందించరైరి యాత్మజ్ఞులు శ్రీ
పతికరనఖరచయముచే
దితి నుండెడువాఁడు గాన దితిజుం డైనన్.

47


వ.

ఇట్లు హిరణ్యకశిపుం డంతరంగంబునం గ్రోధవార్ధితరంగంబులు
వెల్లివిరియ నిజకులశత్రుండైన పుత్రునిం గాంచి చేరంబిలిచి.

48


క.

ఉరమునఁ జేర్చి కుమారక!
పరమరహస్యంబుఁ దెలిసి పలికితి భళిరా!
తిరుగం బలుకుర మాధవ
హరి కృష్ణ ముకుంద శౌరి యచ్యుత యనుచున్.

49


వ.

ఇటువంటి హాస్యదురుక్తులు పలికినవారిని శిక్షించి రాజ్యంబు వెడలం
ద్రోయించితి; నీ వెచ్చట వింటి వనిన నిర్భీతుండై తండ్రితో
నిట్లనియె.

50


మ.

ఇటులం బల్కకు మెన్నఁడేని నసురాధీశా! ఘనైశ్వర్యసం
ఘటనామూలము దుర్బవాగ్నిశమనాకాలాభ్రమౌ నచ్యుతో
త్కటమంత్రం బతిహాన్యమన్న భయశోకగ్రస్తుఁడై దేవతా
తటివిన్ స్నాన మొనర్చినం గలుగునే తండ్రీ! పవిత్రత్వముల్.

51


వ.

కావున హాస్యం బనినఁ బాపంబు దీర నేనుమారులు కృష్ణా యని
స్మరింపుము. మాయ సృజించిన జనులను దారుప్రతిమలంబోలెం