పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/639

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అప్పుడు యుక్తులు తోచక ప్రతివాదులు భంగంబు నొంద సుధాతరం
గంబులైన వాక్కుల విజృంభించి యున్నయెడఁ దండ్రి రోషోద్ధతుండై
యున్న భగవత్ప్రభావం బెఱింగించ నిట్లనియె.

6


క.

వినుము జనక! నిజసేవక
జనకల్పకమైన యట్టి చక్రియశము శో
భనమతులు వారు సన్నుతు
లనిశంబు నొనర్చి ముక్తు లైరి ధరిత్రిన్.

7


వ.

అది యెట్లంటేని వాసుదేవవరంబైన జపంబు జపియించి ము న్నర్భ
కుండైన ధ్రువుండు ధ్రువస్థానంబున బ్రహ్మాదిదివిజులకంటె మీఁదట
నుండి నది యెఱింగించెద వినుము.

8

ధ్రువుని చరిత్రము

తే. గీ.

భవ్యవైభవుఁ డుత్తానపాదుఁ డనఁగ
నాప్తబంధుండు మనకు గుణాధికుండు
సాధురక్షణచణశక్తిచక్రధరుఁడు
దుష్టశిక్షణచణశక్తిధూర్జటియును.

9


క.

ధ్రువుఁడు తనకుం దనూభవుఁ
డవుట మహాధన్యుఁ డయ్యె నారాజున్ వై
ష్ణవబంధుత్వంబు మహా
ధ్రువపూర్వతపఃఫలంబు దొరకక యగునే.

10


సీ.

ధర్మాత్ముఁడైన యుత్తానపాదున కతి
                       నీతిశీలునకు సునీతి యనఁగ
సురుచి యనంగఁ దేజోరాసులైన భా
                       ర్యలు గల రిరువు రుదారమతులు
వారిలో సురుచిపై వర్తిల్లు మోహంబు
                       రాజచంద్రునకు సర్వజ్ఞనిధికి
నప్రియమై యున్న యాసునీతికి ధ్రువుఁ
                       డను విష్ణుభక్తినిష్ఠాధికుండు