పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ఇటులనె ఘనులకు నిష్టతమంబు లౌ
                       బాహ్యమతంబులు బహువిధములఁ
దెలియ నవన్యాయములకు మూలంబులు
                       గా నా కెఱుంగయోగ్యములు గావు;
పాంథు లంధులు గూడి బహుసహస్రములైన
                       తెరువు గానకయున్న దృష్టి గలుగు
నతనిచేఁ గడతేరునట్లుగా నాచేతఁ
                       గడతేరుదురు మూఢకలుషమతులు


తే. గీ.

బాహ్యపక్షంబు లెల్ల సత్సక్షములని
నీకు భ్రమ మయ్యెనేని యానీచమతుల
తోడ సంవాద మొనరించుఁ జూఁడు నేఁడు
నాదుమహిమయె శ్రీజగన్నాథుమహిమ.

224


క.

తత్తన్మతాభినో
ద్వృత్తులగు నవైదికు లవిధేయులఁ గా నే
హత్తింతు న్నన్యాయో
దాత్తోక్తులచేత సమ్మతార్థము గాఁగన్.

225


ఆ. వె.

అని ప్రతిజ్ఞ చేసి యావైదికాగ్రణి
తండ్రియెదుట నిలిచె ధన్యపీఠి
నభయదానపంజరాకృతి యగు శౌరి
నాత్మయందు నిల్పునతిశయమున.

226


సీ.

అంత నద్దైతేయుఁ డాత్మజుప్రతి నస
                       త్యము సేయఁదలంచి యుదగ్రబుద్ధి
గురుసుగతకాణాదగిరిశార్హదక్షపా
                       దవిరించికపిలశాస్త్రజ్ఞవాది
పరుల నందఱఁ బిల్చి వాదింపుఁ డితనితో
                       భవదీయపరశాస్త్రపర్వతంబు
లితఁ డాత్మ సునయేంద్రహేతిచేఁ జూర్ణంబు
                       గావింపఁదలచె మీఘనత మెఱసి