పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/635

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

పరమనియతిఁ బ్రాగ్భవములు
గురులవలన వింటిఁ గథలు గుఱిగా విద్వ
త్పురుషులు శ్రేయోర్థు లగుచుఁ
దిరిగిరి తన్మోహశాస్త్రధిక్కారములన్.

217


క.

నారాయణుఁ డుండఁగ మఱి
వేఱొకని వరుం డటంచు వివరించు దురా
చారులు పాషండులు ని
స్సారులు దద్గోష్ఠి విడువఁ జను ధన్యులకున్.

218


తే. గీ.

ధర శ్రుతిస్మృతివైరుధ్యతరము చైత్య
సేవనాధికకర్మముల్ సేయుచుంద్రు
చాల నెవ్వరు తన్మూఢజనులు పాప
రతులు చర్చింపఁగా వికర్మస్థు లనఁగ.

219


శా.

ప్రోడ ల్చూడకయుండ లోన విషయంబు ల్చాల భోగించి దు
ర్వ్రాడం బాహ్యమునన్ విరక్తులవలెన్ ద్వేషింపుచుం డ్రెప్పుడున్
బైడాలప్రతికుల్ బికాలము పయఃపానాభిలాషంబులో
నాడన్ క్షీరఘటంబు డగ్గఱియు నైరాశ్యంబు గొన్నట్లుఁగన్.

220


క.

పరులఁ దపింపంజేయం
బరధనవిద్యాకులాదిభాసురతేజ
స్ఫురణంబు లెన్నుకొనువాఁ
డరయన్ శఠుఁ డనఁగ మించె నతినీచమతిన్.


క.

వేదానుకూలనన్యా
యాదిప్రతికూలదుర్ణయంబులచేఁ బా
పోదితదుశ్శాస్త్రము ల
త్యాదరమున విను విమతుల హైతుకు లరయన్.

222


క.

ఘనదైవపౌరుషాగత
ధన మంతయు నాశ్రితజనతతి వీడ్కొని తా
ననుభవమునకుం గొను పా
వనికృష్టుఁడు జగతిలోన బకవృత్తి యగున్.

223