పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/634

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

సత్త్వప్రధానమతులు సు
ధీత్వంబున నెంచిచూడ దేవప్రకృతుల్
సాత్వికు లసురప్రకృతు ల
సాత్వికులు రజస్తమోవిసంకీర్ణమతుల్.

212


తే. గీ.

జ్యోత్స్నయందుఁ జకోరముల్ సొంపు గాంచుఁ
గలుగు నాత్మ నులూక మాగమము లట్ల
వీని దేవప్రకృతికిని వేడ్కతోడఁ
మకిలుకొను క్రోధ మాసురప్రకృతికెల్ల.

213


క.

ఖలుల కిటులైన దిక్కున
వెలసినకృతికల్పలతిక విడువఁదగునె సా
ధులు మఱి యాత్మప్రకృతిని
ఫలము గొనుట కాశ్రయించి బ్రతుకం దగదే?

214


క.

తెలివిగల యాగురుప్రభ్రు
తులు జడులే సద్విరోధిదుర్మతభంగం
బులకై మోసము సేయం
దలఁచినపక్షంబు లవియ తత్పరములగున్.

215


సీ.

ఆదివేదోక్తధర్మాచరణైకసం
                       ప్రాప్తతేజస్కులే యంతనుండి
దేవాదిబాధ లుద్దేశించి యత్నంబు
                       గావింతు రెవ్వరు గర్వశక్తి
నటువంటి సౌదర్శనాధిపతి త్రిపు
                       రేశాదిదుర్మతుల్ హెచ్చియున్న
తత్తేజ మడఁగింప ధరణిపై మోహనా
                       గమములు కల్పింపఁగడఁగి రప్పు


తే. గీ.

డమరగురుబుద్ధకణభుగర్హజ్జినేంద్ర
గౌతమాదులు సాధులోకద్విషద్భ్ర
మంబు గావింప బాహ్యశాస్త్రంబు లెల్ల
మేరమీఱఁగఁ గొన్ని నిర్మించి రంత.

216