పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/632

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

గురుసుతు లని మిము నమ్మితి
పరుసంబులు పల్క నేర్పి బాలుని మీరల్
వరవిద్యానిధిఁ జేసితి
రురుమతి మాకాప్తు లౌదు రోహో యనినన్.

200


సీ.

అప్పు డాగురుసుతు లసురేంద్రుఁ డల్గ న
                       ర్హాసనంబులు డిగ్గి యధిప తెలిసి
పలుకుము ప్రభుఁడవు ప్రభుఁ డెట్లు నాడిన
                       నంద మౌనని యిటు లంటి వేమొ
నీతనూభవునకు నేఁడు వైదికమతి
                       శిక్షింప మాజన్మసిద్ధ మేగ్ర
హావేశబంధమో యనఘాత్మ! యెటువంటి
                       గ్రహము సోకిన జీవగణము లటుల


తే. గీ.

నాడుచుండ నవైదికులందు వైది
కగ్రహంబు ప్రవేశించి కాదె యిట్ల
నెదుటఁ బలికింపుచున్నది యిట్ల నీస
భాసదులతో విమర్శింపుమా సురారి!

201


తే. గీ.

ఒనర విశ్వాసపాత్రమై యున్నభార్గ
వాన్వయంబునఁ బుట్టి నీ కభిమతంబు
గాని మత ముపదేశింపఁగలమె యంత
రంగబహిరంగముల దానవాధినాథ!

202


వ.

అని.

203


తే. గీ.

సమ్మతింపుము గురుహితసత్యశౌచ
నియమము నిరర్థమౌ నింక నేఁటినుండి
కాన మది నమ్మి సుతుని వికారమూల
మరసికొను మింకనేని దైత్యాధినాథ!

204


వ.

అని పల్కు గురుపుత్రుల వచనంబులు విని నమ్మి వారికిం బ్రణమిల్లి
సురారి సుతునిం జూచి యిట్లనియె.

205