పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/631

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యనాద్యయై దుర్వికార యైన యది జీవబుద్ధివిక్రియాహేతువైన
త్రిగుణానాద్మనాత్మయొక్క సంబంధ మెద్డి యది రజస్తమోగుణో
ద్రిక్తసాధనయైన కర్మబంధనము వేదవిహితంబులు సేయక
యుండుట, వేదనిషిద్ధంబులు సేయుట ఈశ్వరాజ్ఞోల్లంఘనంబు.
తదాత్మకంబైన కర్మంబు తమోగుణరజోగుణప్రసవకారణము;
శ్రుతిస్మృతిచోదితమై సదనుష్ఠితమై ఫలసంగత్యాగపూర్వకమైన కర్మ
మబంధక మది యేమి యన నచ్యుతాంఘ్రిసద్భక్తికిఁ జేరువనే
యుపకారమై ప్రయాజాదిక మాగ్నేయాదికంబునకుం బలె మలప్రక్షాళ
నంబు వలన మణికి జ్యోత్న్స యేప్రకారంబునం జేయంబడదు
కలిగియున్న యదియె యభివ్యక్త మౌట యెటువలె నినాయావిర్భా
వము లేనియది పుట్టదు. హేయగుణధ్వంసంబువలన నవబోధాది
గుణములు ప్రకాశించుఁ గాని నడుమన్ జనింపదని యాత్మకు
నిత్యత్వంబుల జీవేశ్వరతత్వాధిమూలంబునై శ్రుతిచోదితంబు లగు
కర్మంబులచేతనుం గూడిన యీశానస్మృతి విద్య యని వినంబడిన
యది; ఈవిద్య బుధులకు విష్ణుం డుపాస్యుండని చెప్పుచున్నయదియై
సేవింపందగిన యీశ్వరుని వ్యత ప్రియకాంతయుం బోలెఁ బ్రకాశిం
పంజేయు భక్తిరూప యగు నీవిద్యచేతఁ జూపంబడి హరి తన
దాసునికి బంధంబు మాన్పి సంతోషం బందించు నాయీశ్వరుండు
హేయవ్రత్యానికాసంఖ్యేయకల్యాణగుణసాగరంబును, శ్రీభూనీళా
దీయపతియుఁ జిదచిద్విశ్వనాయకుండును నగు నీశ్వరునికి నే తచ్చి
ద్రూపంబగు ప్రపంచంబు స్వశరీరం బని యుపనిషన్మతము నని
యతంబైన నతండు సర్వచిదచిద్వస్తువ్యాప్తత్వముచేతఁ బ్రపంచంబు
దానయై యుండునని వేదాంతంబు లాయనవైభవంబు బోధించు
చున్నయవి; ఇందుఁ గొందఱు గ్రహావిష్టులుంబలె నిశానిష్టచేతను
లెంతపర్యంతంబు తదాదేశము లంతపర్యంతంబె; ఈశు లన్య
ప్రకారంబున నీశులు గారని తా నడిగిన ప్రశ్నంబులకు నుత్తరంబులు
సెప్పిన నాత్మజసూక్తిభానుప్రభాస్ఫుటాలోకితతత్వమార్గుండై
యంతరంగంబున హర్షించి తద్దంభదైత్యుండు బహిరంగంబున
నసురసంగ్రహంబున కాగ్రహించె నప్పుడు.

198


శా.

కోపాటోపవిజృంభమానకుటిలోద్గూర్ణస్ఫుటభ్రూకుటీ
క్షేపోగ్రప్రళయానలాద్భుతశిఖాకీర్ణంబులై నేత్రముల్
దీపింపన్ దశనాంచలోత్కటకిటోదీర్ఘారవోద్భిన్నసా
టోపారాతిమనస్కుఁడై దితికులాఢ్యుం డంతలో నిట్లనున్.

199