పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/626

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సర్వంబు నంతరంగంబుననే చూచుచు, బాహ్యంబున లేదని
యాడుచు స్మృతిభావార్థమాత్రముచేతం దదిష్టోపభోగంబులు
లేకుండుట యెఱింగినవాఁడునుం బోలె శ్రోత్రత్వగాదికం బెద్ది యది
నన్నుం గూర్చినయది యని యొకానొకచో నెరపుచు, విషయంబు
లస్థిరంబులని వర్ణింపుచు, సర్వంబును క్షణికంబని సౌగతసంతోష
కారిణియై యుదాహరింపుచు, మోక్షమాత్రంబునందు బలోదితంబులైన
సామాన్యతోదృష్టవాదంబులచేతఁ గాణాదుండునుం బోలె నొక్కచోఁ
దఱచు వేదవిరుద్ధంబులు ప్రసంగింపుచు, నాక్షపాదుండునుం బోలె
వేదసంజ్ఞితాగమావృత్తిచేఁ దత్తాత్పర్యబహిర్భూతంబగు దానిం
దర్కంబున నొకానొకచో వాదింపుచు, భోజనకర్మంబులకు స్థావరాత్మ
హింస యంగీకరించియు, నాజ్ఞాసిద్ధశ్రౌతహింస జైనుండుబోలె
దూషింపుచు నేత్రంబులు మూసుకొని హరిం దలంచి బాహ్యార్ధ
విముఖుండగు నొక్కచోఁ దన యనన్యాధీనభావం బతివాదంబున
నుతింపుచు నాకు నీశుండు లేఁడని సాంఖ్యవాది యగు కపిలుండునుం
బోలె భాషింపుచు వేదాచారవిరుద్ధంబు లేని యనుష్ఠేయంబులని
సామసాచారంబున శైవుండునుం బోలె నొకానొకచోట వంచింపుచుఁ
గర్మంబులకుఁ బురుషాకారంబు శ్లాఘ్యంబని దేవతలకుఁ బ్రాధాన్యంబని
జైమినియుంబోలె నుపన్యసింపుచు నిట్లు వర్తింపఁ దత్తన్మతస్థులు
స్వస్వమతస్థుండని తలంచిరి; బాహ్యంబున దైత్యుఁ డంతరంగంబునం
బరమవైష్ణవుండై వర్తించు నమ్మాయావివలన.

176

ప్రహ్లాదుని జననము

సీ.

ఆతనిదేవేరి యాత్మజు నొక్కనిఁ
                       గనియె నాతండు ప్రాక్క్రతుముఖముల
శమదమాదుల మించి జనియించి ఘనమైన
                       హరిభక్తి యితరజన్మాంతరమున
నతిరోహితంబుగా నాత్మపూర్వోత్తరా
                       మౌఘం బణంగించి యప్రధృష్య
లబ్ధతేజమునఁ బ్రారబ్ధకర్మము ల
                       త్యద్భుతవిద్యచే ననుభవించి