పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/625

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

కాన నేనును స్వప్రసిద్ధకలితసర్వ
శక్తియుక్తుండ నైన యీశ్వరుఁడ నస్మ
దాజ్ఞచే లోకములకు సర్వాగమములు
నీశత వహించె నిఁక నిన్ని యెంచనేల?

172


క.

ప్రత్యక్షేశ్వరుఁడును నే
నత్యాజ్యం బగు మదాజ్ఞ నష్టభ్రములై
నిత్యవిసంవాదోద్బూ
తాత్యంతాగ్రహము మానుఁ డాత్మలయందున్.

173


వ.

అని వారలకు నుచితసత్కారంబులు చేసి పనిచి వివాహోత్సవాహూత
దైత్యసురాసురవరులం బూజించి యిట్లనియె:

174


సీ.

ప్రాణమిత్రులు మీరు బాంధవు ల్వినుఁడు జ
                       న్మస్థితిలయము లెన్నటికిఁ జేయ
విశ్వంబునకు నేన విభుఁడ నార్తులఁ గావఁ
                       బ్రాఁపు శక్తుండ నీశ్వరుఁడ నాదు
శాసనంబున నుండి స్వస్వరాజ్యాధికా
                       రంబుల వెలయుఁ డారవియు శశియు
నైన నభోవీథి నరుగంగ వెఱతురే
                       నంగీకరింపక యన్యు లెంత


తే. గీ.

యనుచు, దితికశ్యపులను భవ్యత భజించి
యజుఁడు భారతియును బోలె హరుఁడు నుమయుఁ
బోలెఁ గల్యాణియును దాను బూర్జభోగ
విభవముల నుండె దైతేయవీరవరుఁడు.

175


వ.

ఇటు వివిధభోగంబు లనుభవించుచు భోక్త హరి యని లోనం దలం
పుచు స్వేశశేషత్వదృష్టిజనితప్రీతిం జనింపంబడుచు బాహ్యుండు
నుంబోలె బాహ్యంబున మాయానాటకసూత్రంబున నడపుచుఁ జార్వా
కుండునుంబోలె దేహాత్మాభేదసూచకక్రియలు గావింపుచుఁ గైశికివృత్తి
కామినులం గూర్చి కబ్బంబు లొనర్పుచు, "కాముకేషు సుఖాలాభ”
యనుచు నొకానొకచోటం బల్కుచు జగంబు శూన్యశేషం బని మాధ్య
మికుండునుంబోలె నుచ్చరింపుచు, బహిర్దేశంబున స్వేష్టవస్తువులు
చూడని యట్లుండి హృదయంబున భావించు యోగియునుంబోలె