పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/610

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శక్తిగుణోదయసంపద తద్దైత్య
                       జాతికి నెల్ల విశ్వాస మొదవ
దీపించి బాహ్యకు దృష్టిసమ్మతమైన
                       మతమునఁ బ్రియతమస్థితి వహించి


తే. గీ.

నిస్త్రయులు నిర్దయులు నతినీచతరులు
నగుచు ఘోరతరక్రియ లాచరించి
వైష్ణవద్రోహబుద్ధిమై వార్త కెక్కి
సాధుదూషణపరిచితాచారు లగుచు.

100


వ.

అవైష్ణవులంబోలె నాయందు ద్వేషంబు గావింపుచుఁ గపటంబునం
దిరుగుచు, జితత్రిలోకాధిపతులై జగత్రయంబున ఖ్యాతి నొందుచుఁ
దామసులు తనవారన తామసోపాస్యచరణులై వారలకుం బ్రత్య
యంబుగా బ్రహ్మరుద్రాద్యుపాస్తి గావించి వారలవలన బహువరంబులు
గావించి యత్యాద్యైశ్వర్యపరాక్రమపయోనిధులై విరోధులుం
బలె నటించి మత్పదాంభోజంబు లందెరరు. బాహ్యంబున నసురతా
ఖ్యాతికై సురల బాధించెద రందు నొక్కరునకు.

101


ఉ.

ఔరసపుత్రుఁడై శ్రుతిశిఖార్థము లాడుచు మామకుం డొకం
డీరస మొప్పఁ దండ్రిఁ గవయించఁగ మీఁడనె తేర్చు వాదులన్
సూరుల గెల్చి శౌరి నిదె చూపెద నెందు నటంచు నాడినం
జేరి మహోగ్రవీరనరసింహనిజాకృతిఁ గాంచి నిల్చెదన్.

102


ఉ.

అంతట నన్నుఁ గాంచి పరమాత్మ సమస్తచరాచరంబు లి
ట్లెంతయు దానయౌ ననుచు నాసురవీరులు నిర్ణయించ బా
దాంతికసీమ వారి విగతాసులఁ జేసెద నట్టివేళ న
న్నెంతయుఁ జూచుచుం దనువు లీవి భజింతురు బ్రహ్మభావమున్.

103


క.

పాటిల్లెడు నీమాయా
నాటకసూత్రంబునందు నాప్రతిహారుల్
మేటులు జయవిజయులు ని
త్యాటోపులు మత్ప్రయోజనాయత్తు లిలన్.

104