పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వెలయ ధర్మాధర్మవిద్యాభిమానదే
                       వతలవిజ్ఞాపనం బతులశక్తి
సనకాదులు వినంగ శౌరి యాలించి యే
                       మనియె నాసనకాదియతుల మఱియు


తే. గీ.

నాకృపానిధి సౌందర్య మపుడు గనిన
వారి నేమని మన్నించి వాసి కెక్కఁ
దత్త్వవిజ్ఞానలీలానిధానమూర్తి
యన్నియును మాకు నెఱిఁగింపు మాదరమున.

54


క.

అని సుతుఁడు పల్క నాతని
ఘనబుద్ధి పరాత్మతత్త్వకలితజ్ఞానా
భినవసుధాద్యభిముఖయై
కని మనియె నటంచు మౌని కరఁగుచు ననియెన్.

55


సీ.

పుత్రక! నేఁడు నీబుద్ది యేమనిన ను
                       తింపుదు నీవే సాత్వికుఁడ వాకు
దృష్టివాక్యోద్ధూతతీవ్రవిఘ్నంబు ల
                       న్నియు నొంచి సత్కథానియతి గనియె
నెవ్వరియందుఁ బరేశు కృపాసింధు
                       వమలయై ప్రవహించు నట్టి ఘనులు
సకలాంతరాయముల్ శక్తి మీఱి తరించి
                       తత్కథాసుధఁ గ్రోలఁ దలఁతు రాత్మ


తే. గీ.

నచ్యుతునకుఁ బ్రియంబైన యట్టి కర్మ
మచ్యుతాప్రియమైన యట్టి కర్మ
మమరు ధర్మంబు నాయధర్మము నటంచు
మేర దెల్పుచుఁ దచ్ఛృతిస్మృతులు పల్కె.

56


సీ.

శస్తంబులే నప్రశస్తంబు లేని ధ
                       ర్మాధర్మములు సేయునంతలో శ్రు
తిస్మృత్యుభయసముద్దీపితస్వర్గదు
                       ర్గతి మర్త్యరూపలోకములు గాంచి