పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/599

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రాప్తిబాధరహితమైన యది యర్థయుక్త మౌటచేత నేవిధులకు వారి
చేత శ్రుతమైన యర్థము గల వాక్యమునందును బ్రమాణతాశంక
పోగొట్ట దదియును నీప్రకారంబునను బ్రమాణోపనిషత్తులకును
వారలచేత నందుచేతనే ప్రమాణత్వశంక పోఁగొట్టంబడియె, నను
నయంబున మానమదిగా సనుపనిషన్మీమాంసారంభసంభ్రమంబును
న్యాయమైనయది యీప్రత్యక్షానుమానంబులు విశ్వచిదచిద్వస్తు
నాయకునియందుం బ్రమాణంబులు గా వానాయకునియందు సమీచీన
న్యాయోపబృంహితంబులైన వేదాంతంబులే ప్రమాణంబు లది గాన
యాశ్చర్యశక్తికుండైన యాస్వామి సర్వవేదాంతరాత్మాధిష్ఠితంబు
లైన మఖంబులచేతను బ్రీతుండై తత్ఫల మిచ్చుటకై సమర్థుండు;
జైమినియందు జైనవీరులయందు మొదలు సత్పురుషులకు విశ్వాసంబు
పుట్టింపుచున్నవాఁడై యతివాదంబుచేతం గర్మైకప్రాధాన్యాది
కంబును సూచించె నదిగానఁ దదతివాతోద్ధత శ్రద్ధాజడమతులై
తత్కార్యము తనయంతనె ప్రధాన మని తలంతురు; పుత్రా! వారలు
పూర్వదుశ్శాపతాపజ్వరవికారులై ప్రలాపించుచున్న వారలం జూచి
సత్పురుషులైన వారలు తద్వాక్యంబు లాచరింపరు; సాంగంబులై
న రహస్యంబులైన వేదంబులు చదివి వ్యుత్పత్తిలేశజనితతద్వేదార్థ
వివేకరేఖలు గలవారై తద్బోధశోధననయములను గురుముఖంబుల
వలనం దెలిసి యశేషమూర్తియైన స్వామిని సుగమార్థంబుగా
నెఱుంగంగలరు.

51


మ.

హరిపాదాబ్జయుగంబు గొల్చి సరహస్యాశేషవేదస్ఫుర
త్పురుషోత్తంసనిజాశయం బెఱిఁగి యుద్బోధామృతాస్వాదులై
పరమోత్కృష్టులఁ జేసి తత్పదరజఃపట్టాభిషేకంబుతో
దురసంతామరు లెన్న డుండెదరొ సాధు ల్మెచ్చ వీతార్థులై.

52


మ.

అని యీరీతి దయాళుదివ్యనివహాత్యంతైకశోచ్యక్రియా
ఘనదుర్బోధవివిష్ణచిత్తుల వృధాగర్వాంధులన్ వేదవి
త్తనిరోధార్థకరాత్ములం గని వినీతత్వంబునన్ మ్రొక్క మ
న్నన నీక్షించి ప్రియంబు వల్కఁదగ దెన్నన్ సజ్జనుం డెన్నఁడున్.

53


సీ.

షడ్గుణైశ్వర్యాదిసంపన్నవేదవే
                       దాంతతాత్పర్యవిద్యాపయోధి
ప్రబలకుదృష్టిదుర్వాక్యసంజాతమౌ
                       మద్భ్రాంతి యణఁగె సేమంబు గంటె