వత్సా! యీ దుర్వాదృగ్వాదిజన్మనిమిత్తంబు నీ వెఱింగి
యును దద్వాక్యంబులకు క్షుద్రనయార్థిత్వప్రసిద్ధికొఱకు నడిగితివి,
విను; మిటువలె వాదించు వాదులం బూర్వంబునందు నందికేశ్వరుని
చేత శపింపఁబడిన దేవద్వేషులు భూమియందుఁ బెక్కండ్రు నిర్భా
గ్యద్విజులై కుమేధస్సులై పుట్టి యయధాభిదైకదేశలేశులై తోఁచినట్లు
వేదార్థనిర్ణయమునందు నింత యనియెడు పరిమితి నివేదనంబునందు
నింతయన్న [3]పరిమితిని, కూపకూర్మసమానాభిమానులై వేదాంత
సాగరంబుల నసంఖ్యేయంబులఁగా నెఱుంగక దేవమాయామోహితులై
తలంచిరి; సమస్తవేదంబులును గార్యపరమే కావలయునని తన్న
యంబునఁ బలికి వేదంబునందును బదవాచ్యబుద్ధిలోకవ్యుత్పత్తి
మూలమైనదియె; కార్యానన్వితసిద్ధార్థవిషయమై లోకంబునందుఁ
బదసంగతి లేదు. మఱి యేమి [4]యన: కార్యాన్వితంబైన కార్యమునం
దేరి ఙాద్యన్యతమాభిధ యగు నటుగాన మంత్రార్థవాదంబులకును
గార్యాన్వితార్థత యనియెడు హేతువువలన సమస్తవేదంబులును
గార్యపరంబు; శ్రేయస్సును గార్యపరమే; శ్రుతితాత్పర్యగోచరమైన
శ్రేయస్సు దానికంటె మఱియొకటి కాదు; కామ్యార్థంబునందును
గార్యాన్నమైన స్వర్గాదిసంజ్ఞత ఫల మెద్ది గల దది యానుషంగికఫల;
మిష్టమైనదాని నిచ్చుచున్న ప్రభువైన రాజుంబలె మాకుఁ గార్యమే
ప్రధానంబు; ద్రవ్యంబుబలెఁ గార్యంబు గూర్చి దేవతలు ప్రధానం
బులు గారు; వారలకు భోక్తృత్వము[5]ను యాగప్రసన్నత్వము[6]ను యాగ
ఫలదాయకత్వము[7]ను వేదనివేదదూషకులు చెప్పుదు; రింతియె కాదు