పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

అచ్చట నచ్చట నతిదయాంభోరాశి
                       వైకుంఠనాథనివాసమహిమ
కని కని చని యొకకల్యాణదివ్యధా
                       మముచెంత నున్న సమగ్రమతుల
పంచషడ్వత్సరార్భకుల లక్ష్మీశభ
                       క్తిరససమాస్పదనిరతజనిత
శునగరోమాంచకసుకుల రమాధీశ
                       లోకసౌభాగ్యవిలోకనోత్సు


తే. గీ.

కేక్షణులఁ దత్పదస్థజనేక్షణప్ర
ణయకృతాంజలిపుటల వినమ్రమతుల
బ్రహ్మపుత్రులఁ జూచి యభ్యర్చనంబు
చేసి జయవిజయులు నుతి చేసి యపుడు.

250


సీ.

ఆదిభూతంబైన యావరుణునకు నా
                       నలువురఁ బరమవైష్ణవుల నొప్ప
గింప నాతఁడు భక్తిఁ గీర్తించి పూజించి
                       శంకుకర్ణునకు నాక్షణమె చూపె
నాతఁ డభ్యర్చించి యట గదాదేవి స
                       మ్ముఖము గావింప నమ్మునులఁ జాల
వలగొని యుపచారము లొనర్చి శ్రీధర
                       స్వామిసన్నిధి చేర్ప సమ్మదమున


తే. గీ.

నమ్మహాత్ముల కుపలాలనాదికంబు
మొదలు గావించెఁ బ్రద్యుమ్నమూర్తి కడకుఁ
దెచ్చి యావేల్పు ఘనదివ్యతేజులైన
వారి వైకుంఠపతియొద్ద వరుస నిలిపె.

251


వ.

నిల్పిన సేవించి యుపాసీనులై పరబ్రహ్మానందసింధువులగు జయాది
కులవెంట నిక్షురసవీచికాసంగతి నిక్షురసాంబోధినింబోలె నీశ్వర
సాక్షాత్కారంబు గలిగి నిరంతరానందంబు వహించి యున్నప్పు డొక
యనిర్వాచ్యానందంబు గాంచి సాంద్రచంద్రాతపాతంత్రచకోరంబు
లుంబోలె విజ్వరత్వంబు నొంది యీశవిగ్రహవిన్యస్తదృష్టులై
యనిమిషత్వంబు వహించి రప్పుడు.

252