పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


భానుమండలంబులుంబోలె నేతద్దుర్మతహితంబైన తత్వవిజ్ఞానా
మృతధీధితిమండలంబు వైకుంఠనాథునిచే సాక్షాత్కారంబున
శ్రుత్యంతక్షీరసాగరమువలన సముద్భూతసారంబై విధాతకు నుప
దేశం బయ్యె నది యెఱింగి హేయప్రతిభటాసంఖ్యేయసుగుణపరి
చిత్సత్స్వరూపవమాధికరహిత గుణంబులను వేదాంతంబులు తాము
ప్రశంసించి విశ్వపావనంబు లయ్యె మఱియు.

247


సీ.

రూప మీదృశము స్వరూప మీదృశము గు
                       ణౌఘ మీదృశము విఖ్యాతవిభవ
సౌభాగ్యభర మీదృశం బంతరాత్మత్వ
                       సామర్థ్యగుణ మీదృశంబు సకల
ఫలదాయకోత్తమబ్రహ్మవిద్యాతత్వ
                       మహిమ యీదృశము సమగ్రవేద
వేదాంతశాస్త్రపురాణాది సమ్మతం
                       బై జగంబులను విఖ్యాతి నొంది


తే. గీ.

సతతబుధసమ్మతంబైన మతము లోక
విస్ఫుటవిగాసశంకాతివిధుర మయ్యు
నిప్పు డీకృతయుగమున నెంచఁ జొప్పు
దప్పె బాహ్యోదదుర్వాదతర్కములను.

248


వ.

మఱియు నుపనిషత్పక్షంబున కాక్షేపంబు పుట్టించి ప్రాణసంహార
పర్యంతంబు ననుదినంబును భయంబు నొందించి ఖలులు సత్పరుషుల
చేతఁ దత్పక్షంబు విడిపించిరి. కొందఱు బాహ్యమతవిషాబ్ధి మునింగిరి.
కొందరు సూరుసూరులు వహ్నిపరీతంబులైన భవనంబులు విడిచిన
యట్లు నిజదేశంబులు విడిచి చనిరి. బాహ్యాగమ్యదేశంబుఁ బ్రవేశించి
సూరులు మఱికొందఱు దీనులై కానంబడక విష్ణువును భజించిరి.
సంసారవిషవారాశియందు నమృతంబైన వేదాంతదర్శనంబు
తద్ద్వేషోదధినిమగ్నంబై యుండిన విషయకాంక్షులగు సురలకు
వేదాంతవిచారంబులు వలువదు. సాత్వికు లాసురభయంబున
వేదాంతంబు నుడవ వెఱతు రది గావున వైష్ణవుల కిచ్చట నిలువం
జనదని సనకాదులు హరిమాయాప్రభావంబు ప్రశంసింపుచు బ్రహ్మాం
డంబు వెడలి మహాభూతావరణంబునకుం జని.

249