పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

మహిని సురాచార్యమతము లోకాయత
                       మతమును సౌగతమతము భార
తీశమతంబు మహేశమతంబును
                       జైమినిమతమును జైనమతము
కాణాదమతమును గౌతమమతమును
                       గపిలమతంబును ఘనత కెక్క
నంతకంటెను బ్రశస్తంబె వేదాంతమ
                       తంబు సభాసమ్మతంబె తెలియ


తే. గీ.

నభ్రపుష్పోపమంబు వేదాంతమతము
తన్మహాసౌరభాఘ్రాణతత్పరాభి
మానమాయామిళిందాయమానమాన
మానవులు గొంద రుంద్రు దుర్మత్సరమున.

245


తే. గీ.

అద్దురాత్ములు పలికిన ట్లపుడె నమ్మి
యందుఁ బడి యాసురాత్ములై యఖిలజనులు
వైదికాచారవిముఖులై వైష్ణవులును
విష్ణుదేవుని నిందించి విమతులైరి.

246


వ.

బాహ్యులతోఁ గుదృష్టులతోఁ గూడి వేదవిప్లవంబు సేయుచు నపన్యా
యంబుల దురాగమంబుల వేడ విత్పక్షంబు లపనయింపుచు వేదాంతాభి
మతన్యాయకులిశభగ్నమానసులయ్యుఁ దత్క్రోధమోహాంధులై
నిర్దయులైనట్టు వైభవం బొనర్తురు. కొందఱు మహాభుజాబలులై మంద
మతులై సైన్యంబులచే భూమి చలింపంజేయు దురాత్ములచే భంగంబు
నొంది యలబ్ధశరణులై సత్పురుషు లట్టి దురాత్ములనే శరణంబుగా
వేడుకొనుచుఁ దన్మతప్రశంసఁ జేయుచుఁ దదిచ్ఛాసుగుణవృత్తులై
'యాపత్కాలే నాస్తి మర్యాద' యను నీతి నంగీకరించి మధ్యములు
బ్రదుకుదు రుత్తములైన మహానుభావులు నిగమాంతనిషేధకులైన
వారి నాశ్రయించి బ్రతుకుటకంటెఁ దనుత్యాగంబు సేయుట మేలని
బాహ్యదృష్టులు లేని దేశంబునకుం జని నైమిశాదిపుణ్యక్షేత్రంబుల
విజ్వరులై పరబ్రహ్మోపనిషద్భావనం గొందఱు ప్రవర్తిల్లుదురు.
ప్రవృద్ధములై సంసారబంధకంబులై నిస్స్రేయనవిరోధులైన
బాహ్యకుదృష్టిమతంబులచేత నీహారపటలంబులచేఁ గప్పఁబడిన