పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

తనముఖశ్రీ చూచి తనియనివారి న
                       నన్యభోగాసక్తు లైనవారి
భ్రాంతిఁ బొందనివారి నెంతయు స్వస్వరూ
                       పాదియధ్యాత్మబోధాత్ము లైన
వారిఁ గర్మజ్ఞానవైరాగ్యజనితని
                       జాంఘ్రిభక్తిశ్రీల నలరువారిఁ
దద్ధ్రువత్వవిశదత్వప్రియత్వావస్థ
                       గలవారిని సుబుద్ధి నలరువారి


తే. గీ.

సజ్జనులఁ జాల రక్షించి స్వభజనాతి
దూరగాసురసంవాసదుఃఖసహన
యత్నముల వాసి యాగమాంతానుగుణన
యంబులను వారివర్గంబు లణఁచువారి.

253


క.

మాన్యఘనులైనవారి న
వన్యాయాధిగధురీణపరవాదిదిగు
క్తిన్యక్యారణచణచా
ధ్వన్యత వర్తించి యుత్సవము నగువారిన్.

254


తే. గీ.

త్యక్తబాహ్యాదిసల్లాపు లగుచుఁ దృప్తి
నెరసి యాఖ్యాత మెఱిఁగించి యిచ్చఁదలఁచి
హర్షగద్గదరవపులకాశ్రుపూర్ణు
లగుచు సాష్టాంగనతి నిచ్చ నలరువారి.

255


చ.

అనఘుఁడు నాల్గుహస్తముల నక్కునఁ జేర్చి శిరంబు లెత్తి మూ
ర్కొని పదసంశ్రితాంచదుపగూఢరసాంబుధి నోలలాడి హృ
ద్వనజము లుల్లసిల్ల ననివారితయోగపదాధిరాజ్యల
క్ష్మి నిబిడమై చెలంగ నభిషేకము చేసె ముదశ్రుధారలన్.

256


తే. గీ.

తద్రమయు నాసునందనందప్రబల ము
ఖులు మహాత్ములు నిత్యశూరులును బరమ
పారిషదులును బొగడి యపారమహిమఁ
జాల మన్నించి మన్నించి సంభ్రమించి.

257