పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/568

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


స్వాంతులై తమతండ్రి యనుగ్రహంబున నాఁడు మొదలుకొని హేయ
రూపసాంఖ్యేయకల్యాణగుణసాగరంబై సర్వానందస్వస్వరూపాను
ప్రతిభరూపైకస్వరూపంబై సద్బ్రహ్మకళాత్మశంభుశివాదినామ
గంబై యసాధారణనారాయణవాసుదేవాది కాహ్వయంబై జగద్బీ
జంబై మోక్షప్రదంబై ప్రసిద్ధంబై నిత్యానవధికానందస్వరూపంబై
నిఖిలాశ్రయంబై సర్వానందకారియైన బ్రహ్మంబు భావించి.

235


సీ.

వెలయుచుఁ దన్మనస్కులు తదాలాపులు
                       తత్సపర్యులు తత్పదప్రవణులు
తద్గుణరక్తులు తద్భక్తినిష్ఠులు
                       నగుసనకాదు లత్యంతఘనులు
పంచషడ్వత్సరప్రాయబాలకమూర్తు
                       లవికారులు జితేంద్రియత్వఘనులు
త్రిభువనంబుల దేవదేవాంఘ్రిభక్తగో
                       ష్ఠిప్రపూజలు గాంచి శ్రీకళత్ర


తే. గీ.

సత్కథామృతంబు వినుచుఁ జవులు గొనుచుఁ
జక్రధరభక్తివిముఖాత్మసభలనైన
నధిపసింపరు విష్ణుతత్వావబోధ
పూర్తి యొనరించుకొనుచు నపూర్వశక్తి.

236


తే. గీ.

వాదజల్పవితండోపపాదిశక్తి
వార లొక్కొక్కచోటన వైదికుల జ
యించి కావించినపుడు లక్ష్మీశహృదయ
రంజనంబైన తన్మతభంజనంబు.

237


క.

హరునిసభ నజునిసభ సుర
వరుసభ వరుస భగవదతివైభవములు వి
స్ఫురితన్యాయంబులు సు
స్థిరములుఁగాఁ జేసి మహిమ దీపించి రిలన్.

238


వ.

చెలఁగి వేదాంతదర్శనస్థితులచేత వారు దేవప్రకృతులతోఁ గూడఁ
దద్వేదాంతదర్శనంబు మహాన్యాయంబులచే సంస్థాపించిరి. అసుర
ప్రకృతు లెఱుంగరైరి. మఱియును.

239