పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

తరమే మా కిది నీకు మాయెడలఁ బుత్రస్నేహ మీవేళ సు
స్థిరమై యున్నదొ లేదొ లేనియెడ నీదేహంబు లింకేల న
శ్వరముల్ గల్గిరయేని సౌఖ్య మిడు సాక్షాత్సౌఖ్య మీసృష్టియో
హరిసద్భావనయో మహాత్మ యిది నేఁ డత్యాదృతిం దెల్పవే.

231


శా.

దేహాత్మైకమతిభ్రమాబ్ధిపతితుల్ దీనాత్మకుల్ పుత్ర
రోహాసువ్రతదుష్టకర్మనిరతుల్ యుక్తేతరానేకరూ
పేహాసక్తులు దుష్టమానసులు మీ రెట్లన్నఁ బాటింతు రా
శ్రీహర్యర్చన లాత్మవేదులకుఁ జర్చింపంగ సత్కర్మముల్.

232


వ.

మఱియు వినుము కర్మంబులకు వైషమ్యంబు గలదే. విద్వాంసునికి
నుత్తరోత్తరకర్మంబు లభించదు. వానికి నాథోధఃకర్మనిష్ఠ యుక్తం
బగు నుత్తరకర్మనిష్ఠ యుక్తంబు గాదు. పాయసాన్నభోజనక్రియా
దక్షుఁడు మాతృస్తన్యం బిచ్చసేయని యట్లు సర్వక్రియాఫలబ్రహ్మ
భావనసుఖవేదియైన భక్తుండు పితృమతంబైనంగాని సృష్టిక్రియ
యిచ్చయింపఁడు కావున.

233


సీ.

నిత్యకర్మములఁ బూని కనాద్య మొనరప
                       క తదుత్తరంబగు కర్మమెల్ల
నాచరింపఁగఁ దగదనును శాస్త్రంబులు
                       కామ్యక్రియల కిట్లు గాదు మేరు
విలను సంధ్యాకర్మహీనుఁ డనర్హుండు
                       సకలకర్మముల కెంచఁగ నశుచిత
ప్రాపించునే మా కనర్హత సృష్టి గా
                       వింపనినాఁ డటు విమలచరిత


గీ.

యనిన శ్రీశప్రసాదాపహాతి భక్తి
శేముషియుఁ గల్గు నంచు నాశీర్వదించి
జలజసంభవుఁ డంత నాసనకముఖ్య
పరమభాగవతుల నాత్మఁ బ్రస్తుతించి.

234


వ.

మంగళాశాసనంబు చేసి యనిచిన వారలు ప్రణమిల్లి కృతాంజలులై
యానందబాష్పంబులు దొరుగం దండ్రిఁ జూచి మృత్యువక్త్రంబు
వెడలితి మని తలంచికొని వాయువేగమనోవేగంబులం జని నిర్మల