పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

నానతి యొసంగె శుద్ధసత్వాత్మకమును
నిత్యనిరవధికానందనిర్మలంబు
నైన నిజపద మతనికి నపుడు చూపి
సమ్మదం బొనరించె నాచక్రధరుఁడు.

225


తే. గీ.

రుచిరనిరవద్యమగు స్వస్వరూపరూప
తద్గుణాధికములు చూపి తత్సమగ్ర
భక్తి బ్రహ్మాండలోకాధిపత్య మొసఁగి
యంతఁ దచ్ఛక్తిఁ గన నదృశ్యత వహించె.

226


మ.

తనకుం జేయఁగ నిచ్చగింపఁబడ సత్కర్మంబు లెన్నేని న
య్యనఘుం డబ్జభవుండు శ్రీరమణసేవార్థంబుగాఁ జేసి త
ద్ఘనుఁ బూజించి యహంకృతుల్ వదలి నుద్భావంబుతో నుండఁగా
సనకాదు ల్జనియించి రావిభునకున్ సర్వాధికుల్ సాత్వికుల్.

227


వ.

అని చెప్పి వేదవ్యాసుండు శుకునిం జూచి మఱియు నిట్లనియె.

228


సీ.

ఆచతుర్ముఖుఁడు బ్రహ్మజ్ఞానులగు సన
                       కాదుల న్వర్థనీప్రాంతచరుల
నలువురి సంసారనావమాత్రవిసృష్టి
                       రహితుల నద్భుతార్కప్రభాంక
కనుల నాత్మానాత్మతత్వవివేకుల
                       హరిభజనశ్రవణార్చనాది
పరులఁ బ్రాగ్భవసముత్పన్నపరబ్రహ్మ
                       విద్యాసుధారసవిమలు రయ్యుఁ


తే. గీ.

బ్రస్ఫుటారబ్ధకర్మానుభవముకొఱకు
జననమున మించు కమలసంజాతఁ బాసి
నీమనోహరభక్తుల నిఖిలసద్గు
ణాభిరాములఁ జూచి యయ్యబ్జభవుఁడు.

229


వ.

తదాకారంబులు తత్తేజంబులు తద్విజ్ఞానంబులు నిరీక్షించి యేవంవిధి
సృష్టిఁ గావింపుఁ డనఁ బ్రణమిల్లి వా రిట్లనిరి.

230