పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

యుందు రటుగాన స్వస్వభావోచితసుఖ
మనవధికముగఁ బొందు సమర్థు లెందు
గారు హతులైరి కటకటా ఘనతమోవి
లీనులై నష్టులై యుండనౌ [1]నెట్లు చూడ.

220


క.

అనిశతమోలీనతఁ జే
తను లతిదుఃఖము వహింపఁ దత్పరమవ్యో
మనివాసంబున నుండఁగ
మనసగునే నాకు నెన్ని మార్గములందున్.

221


మ.

అనిశంబున్ బ్రజ దుఃఖశోకభయమోహభ్రాంతులై పాఱ శో
భనభాగ్యోదయసంపద ల్గనియె నాతద్భర్త పూర్ణుండు యా
తనలం గొందఱు కొంద ఱుత్కటసుఖౌదార్యంబులన్ మించ నే
పునఁ దర్భత్తయు నర్ధపూర్ణుఁడగు సంపూర్ణుండు గాఁ డెంచినన్.

222


ఉ.

ఎంచఁగ నెవ్వ రెవ్వరికి నెయ్యది యిష్టతమంబు దాని స
భ్యంచితశక్తి నిత్తు హృదయంబు గరంగఁగఁ జూడ నీవు ని
ర్వంచన సత్కృపామహిమ వారికి దేహములున్ స్వశక్తులున్
మించ నొసంగి కోరిక లమేయముగా నొనరింతు నిత్తఱిన్.

223


తే. గీ.

స్వగుణసౌభాగ్య మి ట్లాత్మసతికిఁ దెల్పి
సృష్టిసంకల్ప మాత్మలోఁ జేయునంత
జగము లపు డుద్భవించె నాశ్చర్య మంద
నఖిలమును బూర్వమున నున్నయట్ల చేసె.

224


సీ.

అఖిలలోకంబులు నద్భుతం బొప్ప సృ
                       జించి యాసత్కృపాశీలుఁ డాత్మ
నాభిగర్భోద్భూతుఁడై భూతి మెఱయు చ
                       తుర్ముఖబ్రహ్మ చతుర్దశోత్త
మబ్రహ్మవిద్యాసమన్వితస్థానంబు
                       నం దధికారిగా నన్వయించి
వేదదృష్టంబైన విమలమార్గంబున
                       నిర్మించు నీ వని నియతకరుణ

  1. నౌనె