పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ఘనతరమయి యసంఖ్యమయి బ్రహ్మలోక
                       మౌనట్టి పరవ్యోమ మరయ నెద్ది
యదియ విశుద్ధతత్త్వాఖ్యతత్వంబు సు
                       షిరమున నామించి చెలఁగె నది త్రి
పాద్భూతితదురుత్రిపాద్భూత్యధోభాగ
                       మధ్యదేశైకసమాశ్రయమునఁ
దగు నతర్క్యాద్భుతతరశక్తికంబుగ
                       వ్యయముననైన కాలాఖ్యతత్వ


తే. గీ.

మది యధోముఖచక్రమై యంటి తిరుగుఁ
బరగుఁ దదవస్థ లీమధ్యభాగనాభి
మిళితమై త్రిగుణాత్మయై మెలఁగ [1]నాయ
జాదులకునైన నెఱుఁగ శక్యంబె దాని.

214


మ.

ప్రమదావృత్తకులాలచక్రగతమృద్భావంబునన్ యోగిస
త్తము లోహో యని యెంచి చూడఁగఁ దదుద్యత్కాలచక్రభ్రమ
క్రమభేదంబులఁ గాంచు విక్రియ లనేకంబుల్ తరంబే యజా
సముదారత్వము మెచ్చ నీశ్వరనిజేచ్ఛాధీనమై యుండఁగన్.

215


తే. గీ.

అజవికారంబు నొందిన యది యసృష్టి
యజనికాసంబుతో నుండునదియ యునికి
యజకు సంకోచ మన నెద్ది యదియె వేల
యఖిలలోకార్హమైన బ్రహ్మాండమునకు.

216


మ.

చిరకాలంబుగ నాదిసిద్ధకలితాచిద్రూపమో నాయజన్
బరితోవ్యాప్తి ననాదిచేతనులు తద్బద్ధస్వశక్త్యాత్ములై
తిరమై యుందురు తథ్య మీవిహితశ క్తిజ్వాలకీల్యంశవి
స్ఫురణం దంత మనోచితార్థకరణంబుల్ మాని యెల్లప్పుడున్.

217


వ.

మఱియు ననేకరూపప్రకృతిరూపస్వభావోదితవిభ్రాంతులై స్వాతి
రిక్తంబులైన భగవచ్చేషతైకాకృతులె ప్రాగ్భవీయకర్మానురూప
దుఃఖాతిహేతువు లగు దేహేంద్రియమనఃప్రాణాదులయందు నాత్మా

  1. నజరాదులకైన