పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఇ ట్లేకరూపంబున నీశ్వరుం డన్నియెడల నుండుట చోద్యంబె. అప్ర
తర్క్యాద్భుతశక్తియగు విభుండని విశ్వసించి హతదురితులై వామ
దేవాదులు కొందఱు వాసుదేవపరాయణలై యుండ్రు. మఱికొందఱు
మును లఖిలహేయప్రత్యనీకకల్యాణేకతానశ్వేతరసమస్తవస్తు
విలక్షణానంతజ్ఞానానందైకస్వరూపనిత్యనిరతిశయౌజ్జ్వల్య
సౌందర్యసౌగంధ్యసౌకుమార్యలావణ్యయౌవనాద్యనంతగుణనిధి
యగు భగవంతుండు నాత్తవిగ్రహంబులై శుద్ధసత్వాత్మపరంబులై
శుద్ధకళ్యాణగుణసాగరంబులై నిత్యముక్త సేవితంబులైన పర
వ్యోమనిలయసకలవిభూతులను వీక్షించి తత్సదృశానేకరూపం
బులు గావలయునని యిచ్ఛామాత్రంబువలనం గలిగిన శుద్ధసత్త్వ
రూపదివ్యవిభూతులతోడం గూడం బ్రకృతిసృష్టియవస్థయందున
పంచీకృతాత్మకములైన మహాభూతములయందుఁ బరబ్రహ్మలోక
వ్యూహవిభూతులతోఁ దా నవతరించి యక్కడను స్వస్వరూపాత్మ
జ్ఞానసంపన్నులగు దివ్యయోగీంద్రులకుం దక్కఁ దక్కినవారలకు
సేవింప నలవి కాదని విలోకించి పంచీకృతమహాభూతారబ్ధభూముల
యందుం బ్రవేశించి స్వప్రియవ్రతచారులై కేవలు లైనవారిచేత సేవిం
పంబడుచున్నవాఁడై కృతార్థుండ నైతినని తలంచి మహౌదార్యసుశీ
లత్వవాత్సల్యాదినిజసద్గుణంబులతోఁ గూడినవాఁడై సర్వదేవవేద
హృదయాహ్లాదముచే సిద్ధచతుర్దశమహాలోకంబులందు శ్రీవైకుంఠ
శ్వేతద్వీపక్షీరాబ్ధులయందును సవితృమండలమధ్యమమునందు
నృసింహరామకృష్ణాదివిభవావతారంబులు శ్రీరంగశ్రీపురు
షోత్తమశ్రీవేంకటాచలకాఖ్యాహోబిలబదరికాశ్రమాదులయందును
దత్తద్గ్రామగృహార్చవిగ్రహసాలగ్రామాదిమూర్తులయందును జేతనా
చేతనాంతర్బహిఃపూర్ణుండై సేవకజనుల నభీష్టాకృతులు ధరించిన
వాఁడై సకలేప్సితంబు లొసంగుచు శుభైకదానస్వలీలాబ్ధియందు
విహరింపుచున్నవాఁ డని యందురు. ఈఋషులమతంబునం దున్న
శుద్ధసత్వాత్మకత్వాదిస్వగుణాంబుధి దివ్యదేహములచేత సర్వస్థల
ములయందును భగవంతునికి సన్నిధానము గల దనియెడి నిశ్చయం
బున నిట్లుండి యేస్వామి నిత్యముక్యైకభోగ్యుం డగు నాస్వామియె
స్వకీయదివ్యమంగళవిగ్రహవిభూతులచేత సనకాదులయిన
స్వప్రియులకుఁ బ్రసన్నుం డయ్యె ననుట యుక్తంబు.

193