పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

అని యి ట్లాత్మగురుండు పల్క నట సాష్టాంగంబుగా మ్రొక్కి య
త్యనఘుం డాపరమార్థవేది బహుళార్థాకారుఁడై తాఁ బునః
పునరుద్బుద్ధశిరఃప్రకంపనయనాంభోరోహరరోమాంచలాం
ఛనుఁడై భవ్యపరాశరాత్మజ విశిష్టస్తోత్రదృష్టిం దగన్.

194


వ.

ఈయజుర్వేదంబు సత్వదవాఙ్మానసవిత్తముండవై న న్నెఱుంగక యట్లు
"సహోవాచ వ్యాసః పారాశర్య" యని నిస్వోదీరితార్థంబునందు
నీవచనము ప్రమాణంబుగాఁ బలికె నింతకంటె నిన్ను నెట్లు నుతింప
వచ్చు నీవే లోకోత్తరుండ వగుట.

195


సీ.

శ్రీ మించు తత్పరవ్యోమంబునందుండి
                       యవతరించి నిమీలితాత్మకంబు
లగు మహాభూతంబులందు వరప్యూహ
                       ములతోఁ బ్రకాశించి యలఘుకరుణ
సనకాదులకు నిట్లు కననయ్యె ననుచు మీ
                       రానతి యిచ్చితి రదియె విస్త
రముచే నెఱింగింపు సముఁదీశ్వరుఁడు సర్వ
                       భూతములకు నట్టి పురుషమౌళి


తే. గీ.

యూర్థ్వలోకాధివాసులై యున్న యజహ
రాదుల నుపేక్ష గావించి యగ్రముననె
యట్టి సనకాదులకును బ్రత్యక్షమయ్యె
బుధులు వైషమ్య మన రెట్లు బుద్ధిఁ దలఁచి.

196


తే. గీ.

సర్వభూతంబులను నేలు స్వామి ఘనుఁడు
సర్వభూతసంహృత్తు తజ్జనులలోన
నెట్లు గావించెఁ గొంద ఱీయెడల సంత
తాధిగతమైన సౌహార్ధ మాత్మలోన.

197


క.

అని యనితరసౌమ్యంబుగఁ
దనయుఁడ ప్రశ్నంబు సేయఁదగునని హర్షం
బొనరం బారాశర్యుం
డనియెన్ వస్తుస్థితి ప్రమార్హము గాఁగన్.

198