పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


లేకలహంబు ననేకదేశంబున
                       నుండి యొక్కరుఁడె భుజోరుశక్తి
దున్నుట తగునె యద్భుతముగఁ బ్రాకృతా
                       ప్రాకృతపదములం బరమపురుషుఁ


తే. గీ.

డొక్కతఱి దివ్యతరమైన యొక్కరూప
ముననె యుండినయట్లుగా ననుట దోఁచె
నదియ యుక్తంబువలెఁ గాననయ్యె మూర్త
మనుట నుభయపదప్రాప్తి మనుట యెట్లు?

184


వ.

హరికి నేరూపంబు చూడనయ్యె నారూపంబు భయస్థలస్థితంబు గాదు.
శక్తివిశేషముచే నారూప మక్కడను మఱియు నొకదిక్కుననుం
బ్రకాశించుం గాక యని యంటి మారెండుస్థలములయందుఁ దాఁచిన
యొకవస్తువు దా నొక్క స్థలముననే యుండుట నిజం బిట్లుండి రెండవ
దిక్కున నున్నయవి యని తోఁచుట భ్రాంతి ఖగం బొక్కపరి
భూనభఃప్రదేశంబులఁ గానుపించునె యుభయపదస్థితి యీశ్వరునకు
మూర్తత్వక్షతి యగుం గావున దుస్తర్కప్రభవం బగు నస్మన్మనో
దోషంబుఁ దీర్పవే కృపాబ్ది భగవత్తత్వవిద్యచే నని శుకుం డడిగిన నగు
మొగంబున విష్ణుశక్తివిజ్ఞానధుర్యుం డగు పారాశర్యుం డిట్లనియె.

185

విష్ణుమహిమ – ఉభయపదప్రాప్తి

తే. గీ.

తథ్య మెంచ మహాద్భుతాతర్క్యబోధ
శక్తి యీశ్వరునకుఁ గల్గ జగతిమీఁద
ఘటము పటముగఁ గావించు ఘనుఁడు తత్ప్ర
శస్తమహిమకుఁ దర్కావసరము గలదె?

186


క.

సంకల్పమాత్రమునఁ గా
ర్యాంకురములు వొడుమఁజేయునట్టి సమర్థుం
డోంకారమూర్తి శ్రుతిపద
సంకేతుం డితరు లతనినములే యెంచన్.

187


తే. గీ.

లోకసామాన్యలక్షణాలోచనమునఁ
దెలిసి దృష్టాంతహేతువుల్ దెచ్చి యిప్ప
రేశ్వరుని నిశ్చయించువా రెవ్వ రట్టి
జనులు మూఢులు శాస్త్రముల్ చదివిరేని.

188