పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/555

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

కరుణాసింధుండగు వైకుంఠాధిపతి పరమదయాళుండై విషాదంబు
నొంది రమతో నిట్లనియె.

181


సీ.

పద్మలోచన పరబ్రహ్మ లోకాధివా
                       సు లచేతనుల నెల్లఁ జూడు నిత్య
నిర్మలకర్మాబ్ధి నిరవధికవిలో
                       లత నున్నవా రకలంకమహిమ
బద్ధులఁ జూడు తాపత్రయావిద్ధుల
                       నెలఁత నీతోడ వినిత్యముక్త
నరులతో సిరి గల్గు నామస్వరూపరూ
                       పోభయగుణభూతులు భయవిధమ


తే. గీ.

దాత్మవర్గోపభోగభోగ్యామృతాంబు
రాశియై యుండఁ జూడ ధర్మంబె నాకుఁ
బ్రాకృతాప్రాకృతజనులు పరమహితులు
సముఁడ నే నందఱకును వాత్సల్యశక్తి.

182


వ.

నిత్యముక్తోపభోగ్యస్వరూపగుణాధికము ప్రాకృతచేతనులకుం
బ్రకాశంబు గావింపకున్నఁ బ్రబుద్ధులగు పుత్రుల నాదరించి బాలకుల
నుపేక్షించిన తండ్రిచందం బగు. పరబ్రహ్మలోకస్వామిత్వంబును
నాకు యాతన గావున నీవైభవంబు సంకోచంబు నొందించి
ప్రాకృతలోకంబుల నధివసించెద నని రమతోడం గూడి ప్రాకృత
లోకంబుల స్వలోకంబులు గల్పించుకొని యుండెడి. నాలోకంబులు
సనకాదులకు సుగమంబులు. ఇతరులకు మహాపుణ్యంబు లొనర్చినను
దుర్గమంబులు. ప్రాకృతదేహులైన సనకాదులకు స్వసంకల్పాను
రూపంబున నిజరూపంబుఁ జూపెనని పల్కిన మఱియు శుకుం
డిట్లనియె.

183


సీ.

హరి పరవ్యోమంబునందు దీపించె నే
                       రూపంబుచేత నారూపముననె
ప్రాకృతపదమునఁ బ్రాపించె నెట్ల న
                       తివ్యవహితము తాదేశపథము