పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

నప్రమేయత స్వాభావికానవధిక
నిరుపమాతిశయైకత నివ్వటిల్లి
తత్వవిత్సూరిపరిషత్సదానిషేవ్య
మానుఁడై యున్న పరమాత్మ మది దలంచె.

178


సీ.

సతతకాలత్రయచక్రచంచద్గుణ
                       త్రయవేష్టి కాదిమప్రకృతి నంటి
[1]తన దవిద్యాకామకర్మాదివా[2]సనా
                       రేణుమండితులై పరిభ్రమించి
రుచిరబోధానందరూఢి గనియు ననా
                       త్మికభ్రమాకూలులై చలించి
సత్యకామత్వాదిసద్గుణాన్వితు లయ్యు
                       నంతరంగమున దైన్యము వహించి


తే. గీ.

నీరు గప్పిన నిప్పులై నిష్ప్రభత్వ
పూర్తి పరధామలోకోపభోగభోగ్యు
లయ్యు నామాయఁ జెంది కర్మాదిభేద
ములఁ బ్రవర్తిల్లు సంతతమును దలంకి.

179


సీ.

హేయమౌ నిది యుపాధేయమౌ నిది యని
                       స్వాంతంబులో వివేచనము లేక
హేయముల్ గొని యుపాధేయముల్ విడుచుచ
                       క్షుత్పిపాసామోహశోకరోష
గతజరామరణనిష్కాతీతు లగుచు శ్రు
                       తిస్మృతులై యస్మదీయనిరుప
మాజ్జ చెల్లఁగనీక యంత నుల్లంఘించి
                       యపరాధశతము లత్యంతశక్తి


తే. గీ.

చే నొనర్చుచు నిరయముల్ చేరి మఱియుఁ
బథ్యములు చేసి వేదనల్ బడలియున్న
రోగు లట్లనె సంసారరుగ్మభగ్న
హృదయులై యున్నవారల నెఱిఁగి చూచి.

180
  1. సి