పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

యముఁడు సర్వస్మృతేతిహాసార్థతత్వ
వేది యగు వైష్ణవాగ్రణి విష్ణులాంఛ
నాన్వితుఁడు నా కుపాస్యుఁడౌ ననుచుఁ బలికె
సంభ్రమంబున నిజభటజనులతోడ.

134


చ.

శమనుఁడు బాహుమూలములఁ జారు సుదర్శనపాంచజన్యచి
హ్నములు ముకుందనామములు నాలుక రమ్యతరోజ్వలోర్ధ్వపుం
డ్రము నుదుటం గళంబున స్ఫురద్విచలన్నలినాక్షమాలికాం
కము గల వైష్ణవుం గని ప్రగల్భమతిన్ నుతి సేయు సుస్థితిన్.

135


వ.

ఇది మొదలుగా నేతద్వాక్యోపబృంహితమహోపనిషదాద్యుపని
షత్తులయందును హరిలాంఛనంబు వహింపఁగా వలయునని వినం
బడియె మరియు.

136

హరిలాంఛనవివరణము

శ్లో.

దక్షిణేతు భుజే విప్రోభిభృవద్వై సుదర్శనమ్
సవ్యేతు శంఖం బిభృయాదితి బ్రహ్మవిదో విదుః

137


శ్లో.

ధృతోర్ధ్వపుండ్రం కృత చక్రధారీ
విష్ణుం పరంధ్యాయతి యో మహాత్మా
స్మరేణ మంత్రేణ సదాహృది స్థితమ్
పరాత్పరం యన్మహతో మహాత్మమ్?

138


సీ.

క్షితి సురోత్తముఁడు దక్షిణభుజమున సుద
                       ర్శనము నా వామభుజంబునందు
శంఖంబుఁ దాల్చుట చనునని బ్రహ్మవే
                       దులు పల్కుదురు భక్తితోడ నూర్ధ్వ
పుండ్రంబుఁ జక్రంబు పూని సద్గుణమహీ
                       యస్త్వంబు నొంది సమగ్రశక్తిఁ
బరఁగు విష్ణుని [1]పరాత్పరుని హృదంతర
                       స్థాయిఁ గావించి సంతతము మంత్ర

  1. పరాపరుని