పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

హరినింద సేయు పాతక
వరు లుండినచోట నరకపద మాక్షిత్ప్రాం
తరమునను శుద్ధవైష్ణవ
వరులు నిమేషాంతరంబు వలవదు నిలుపన్.

129


తే. గీ.

ధర నసాత్వికదేవప్రధానమైన
యది యసాత్వికతీర్థమౌ నందు నుండఁ
దగదు సాత్వికులకు విష్ణుధామ మెద్ది
యదియె సర్వప్రదము తగు నందు నుండ.

130


సీ.

తదధీనవృత్తిమై దనువు గల్గిన యన్ని
                       నాళ్లు శ్రీహరిసేవనం బొనర్చి
సౌఖ్యంబు నొంది యసాత్వికదేవతా
                       భజనంబు చేసినఁ బాయు సత్వ
గుణ మెల్ల నాసత్వగుణము పోయిన నధః
                       పాతంబునందు దుష్పాతకముల
వైష్ణవవర్యుఁడ వైష్ణవసంవాస
                       సంభాషణముల దోషంబుఁ గాంచు


తే. గీ.

శ్రౌతకర్మంబు స్మార్తకర్మంబు నడుపు
నయ్యసూచానుఁ డగు విప్రునైన వైష్ణ
వాన్వయునిఁ గానివానిఁ గల్యమునఁ జూచి
చన దసాత్వికునకు నమస్కార మెసఁగ.

131


క.

వైష్ణవుఁ దెగడిన నెదుట న
వైష్ణవుఁ గని మ్రొక్కినన్ భవధ్వంసకుఁడౌ
విష్ణుని నిందించిన యన
హిష్ణుఁడు వాఁ డెంచఁ బతితుఁ డే మనవచ్చున్.

132


చ.

హరిభజనంబు సేయక దురాత్ముఁ డసాత్వికతత్వదేవతాం
తరభజనంబుఁ జేసి వసుధాస్థలి నంత్యజుఁడై వసించు దు
శ్చరితుని వానిఁ జూచినను సమ్మతి నంటిన మాట లాడినన్
నరు లొకవైష్ణవుం గని ఘనస్థితి మ్రొక్కి స్పృశింపఁగాఁ దగున్.

133