పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

చింతించి 'యచ్యుతో౽హ మ
నంతో౽హం హరి రహ మ్మురారి రహం శ్రీ
కాంతో౽హ'మ్మను నాతని
నంతం బందించె దానవాంతకుఁ డంతన్.

76


క.

రాజులు నిజరాజ్యరమా
తేజఃకాంక్షులను గని వధించుపగిది ల
క్ష్మీజానియుఁ బరు లాత్మ
శ్రీజయసంపదలు గోర శిక్షించు నిలన్.

77


క.

భువిలో నంతర్యామి
ప్రవిశుద్ధాంతస్స్వరూపభావము లక్ష్మీ
ధవు స్వస్వరూపవిభవం
బవినీతుఁడు తనకు ననిన <ref>యణగక యున్నే<ref>నణఁగకయున్నే.

78


క.

తనకుఁ దను నేలు స్వామికిఁ
బనుపడిన విలక్షణస్వభావత్వ మెఱిం
గి నిరత మత్యను[1]కూలై
క్యనియతిఁ బాటించెనేని యాత్మజ్ఞులకున్.

79


వ.

వేఱైన వస్తువులకు నైక్య మనఁగా మనముల నన్యానుకూలములై
యుండుటే, వస్తుద్వయ మొకటియై యుండుట గాదు. అది యెట్లంటేని.
భేదముల్ పలికి వేదవాక్యములు నిరోధించుం గనుక విభిన్నవస్తు
ద్వయ మేక మనుట విరుద్ధము. వస్తుద్వయము వేఱే యనుట విరుద్ధము
గాదు. జీవాత్మ పరమాత్మలకు నైక్యంబు చెప్పెడి వాక్యంబుల కున్న
భేదము చెప్పెడు వాక్యంబులకును నిటువలెనే యర్థంబు. అర్థ
ప్రకరణలింగౌచిత్యదేశకాలాదులచేతం గాని కేవలశబ్దంబువలన
నర్థంబు నిర్ణయము చేయరాదు. అది యెటువలె నన్న.

80

జీవాత్మ - పరమాత్మల యైక్యము

తే. గీ.

కానుపించిన దంపతి కలహబంధు
కలహభేదైక్యరూపవాక్యములువోలె
శ్రుతిసముదితైక్యభేదంబు లతిశయమున
స్వోచితార్థగతంబులై యుండు నెపుడు.

81
  1. కులై