పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ప్రకటవిభేదాభేదఘ
టకరూపశ్రుతులు సూత్కటంబుల మిథ్యా
రకములు తెలియందగు నె
న్నికనని బోధాయనుండు నియతిం బలికెన్.

82


క.

క్షితిలో నెంచ నభేద
శ్రుతి యన్నిట నాత్మభేదరూపనిషేధ
స్థితి నున్న భేదవాక్యము
లతిబాధ్యతరంబు లగుచు నడఁగక యున్నే.

83


వ.

భేదాభేదఘటకభేదంబునఁ ద్రివిధంబులై యుండు వాక్యంబు లటుగాన
సమస్తావస్థచిదచిద్విశిష్టతత్పరంబులైన యవి యభేదప్రధానంబులు.
విశేషణాదిభేదోపజీవితంబులైన యవి భేదప్రధానంబు లిట్లని యెఱుం
గందగిన యభిప్రాయంబు గలిగిన యవి ఘటకరూపంబులగు శ్రుతులు.
హరికి సమస్తచిదచిద్వస్తుశరీరత్వాదికంబును బలుకు కల్యాణగుణ
తత్పరంబులైన యవి సగుణవాక్యంబులు. హరికి హేయగుణ
రాహిత్యంబు పలుకునవి నిర్గుణవాక్యంబులు. అట్లు గాకున్న
నన్యోన్యకలహంబున నన్యోన్యతరబాధ్యత్వంబునఁ దద్వాక్యంబుల
కగు నట్లౌటఁ దద్వాక్యంబులకు బోధనీయభేదవివేచనంబు సార్ధం
బుగా నెఱుంగవలయు. ఈమార్గంబున వేదాంతతాత్పర్యవిషయం
బని హరిని నమ్మియున్నవార లాత్మసంతోషకులు. సర్వభూతం
బులును హరి శరీరంబులును దద్భూతహితైకరతులైనవారు విశ్వ
మూర్తికిఁ బరమప్రియులైనవారు తన్మనస్కులై తదాలాపులై
తదీయప్రియసత్కర్ములై తదిష్టితములైన వారలు పరమధామం
బున రమింపుదురు.

84


తే. గీ.

శుకభవల్లీల వేదాంతసుఖనిరూప్య
రమ్యతత్వత్రయేశ పరత్వశుద్ధ
శేముషీయుక్తులై దయాశీలురైన
నాత్మ విద్యామృతాస్వాదు లగుచు నుండ్రు.

85


శా.

సంసారోగ్రతరజ్వరామయభవస్ఫారైకతాపత్రయో
ధ్వంసోన్మూర్ఛితబుద్ధులౌ నరులకున్ స్వస్వోచితార్ధగ్ర మీ
మాంసాకల్పితతత్పరార్థధిషణామ్నాతంబుగా నుత్తముల్
సంసేవించి హితోపదేశ మొనరింపఁజూతు రశ్రాంతమున్.

86