పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

భాగవతమందిరంబులఁ బరమశాంతి
గాని క్రౌర్యంబు లేదు లోకంబునందు
సాత్వికోత్తమమూర్తియౌ చక్రధరుని
పాదపద్మంబు లాత్మలోఁ బాయకున్న.

42


సీ.

జగతిపై ఋషుల యాశ్రమపదంబుల శాంతి
                       గాని క్రౌర్యము లేదు ధేనువత్స
హరిణవత్సంబుల నాఘ్రాణ మొనరించి
                       యాత్మవత్సల కోడ వ్యాఘ్రి కాదు
లూధ స్స్రవద్దుగ్ధ మొయ్యనొయ్యన నిచ్చు
                       బ్రహ్మపుత్రులు శాంతివరులు ఘనులు
సనకాదు లత్యంతసాధులు వైష్ణవ
                       ద్వారపాలకుల నుద్ధతి శపింపఁ


తే. గీ.

దగునె భగవన్నిరంతరదాస్యనిష్ఠు
లైన దౌవారికులు సనకాదిసాత్వి
కోత్తముల కవమతి సేయ యుక్త మగునె
సంశయంబెల్లఁ దీర్పవే సాధువర్య!

43


మ.

జలజాతాక్షుఁడు విశ్వమంతయు మనస్సంకల్పమాత్రంబునన్
గలిగించన్ వెలయించ నొంచ నతిలోకంబైన సామర్థ్య మ
గ్గలమై చొప్పడి మించినట్టి హరి లోకైకప్రభుం డెట్లు నా
త్మ లసద్దామమునందు నుండి హరి మర్త్యశ్రీ ధరన్ నిల్చెనో.

44


సీ.

పంచాననంబును బాంచజనమునైన
                       యాకార మేటికి హరి వహించె
నుక్కుకంబముననే యొప్పున నుదయించె
                       ద్విభుజుఁడై యున్న యాదితిజు గెల్వ
బహుబాహుఁడై యెట్లు పాటించె నివియు న
                       న్యంబులు నెఱిఁగించు మస్మదీయ
సందేహవిషమహీజముల నిశ్చయతనం
                       బున నోర్వ నీకంటె ఘనుఁడు గలఁడె