పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అట్లు ప్రహ్లాదుండు పూర్వజన్మార్జితబ్రహ్మవిద్య గలిగియుండియు
దైత్యువంశంబున నెట్లు జన్మించె నాహిరణ్యాక్షహిరణ్యకశిపులు
మున్ను వైకుంఠద్వారపాలకులని నీవలన వింటిమి. శ్రీవిష్ణు
ధామంబు పునరావృత్తిరహితం బని పార్థసారథి “యద్గత్వాన
నివర్తంతే తద్ధామ పరమం మమ" అని యానతిచ్చె “ఏష దేవోపమో
బ్రహ్మపథానేన పరంగతా ఇమం మానవ మావర్తంతే” యను శ్రుతి
యున్నయది గాన పునరావృత్తిరహితం బని పార్థస్పురద్ధాములగు
వారికిఁ బునరావృత్తి యెక్కడిది యని కొంద ఱాడుదురు. కొందఱు
పునర్జన్మహేతువైన యాలోకము తత్వత్రయజ్ఞానహీనులై విష్ణు
కర్మనిరతులై పుణ్యఫల మనుభవించువారికి భోగస్థానంబు గాని
యప్రాకృతదివ్యధామంబు గాదని చెప్పుదురు. జయవిజయులు
ద్వారపాలకులైన శ్రీవైకుంఠము స్వర్గ మనిపించుకొనిన భోగస్థానం
బు గాని యప్రాకృతదివ్యధామంబు గాదని కొందఱు చెప్పుదురు.
జ్ఞానలోకం బయ్యెనేని త్రిపాద్విభూతిపాంచభౌతికాత్ములైన సన
కాదులకుఁ బ్రాప్యంబుఁ గా దదియునుంగాక యర్చిరాదిమార్గంబున
నాత్మబలవిద్యావిశేషంబున, సప్తావరణంబు లతిక్రమించి విరజం
దోఁగి పూర్వదేహంబులు వదలి లింగవిగ్రహరహితులై వీతవసనులై
యమానవకరస్పర్శంబువలన నావిర్భూతస్వశక్తికులై పరమ
వ్యోమంబునఁ బరమానందంబునఁ బరమాత్మతో నిత్యానవధికానంద
భోగమాత్రసదృక్షత్వంబును, తద్దివ్యరూపానురూపానురూప
మాత్రస్వరూపత్యంబును బొంది స్వనిత్యదాన్యైకరసాత్మత్వాది
సద్గుణంబులుం బరానవధికస్వామ్యంబులు ననుభవింపుచుఁ దత్స్వ
భావానురూపైకప్రీతికారితంబైన భగవన్నిత్యకైంకర్యంబునందు
రమింపుచుం బ్రేమ గద్గదావలోకనంబుల నొండురులం జూచుచు నొక
రొకరి విరోధింపక యుండ్రు. తల్లోకస్థుండైన యొకానొకని కేనియు
ద్రోహం బాచరింపరు. సనకాదు లాధామంబున నుండి [1]ప్రత్య
ద్వారపాలకులతో నసూయ పడి శాపం బిచ్చి రది యప్రాకృతం బగునే?
ప్రాకృతలోకంబునుండి పునరావృత్తి గలుగుటం జేసి వారలకు విరు
ద్ధంబు గాదని కొంద ఱాడుదు రది మాకు సమ్మతంబైనను మాకు
నడుగం దగినయది గల దది యడిగెదము. ఇంకను,

41
  1. ప్రత్యద్వారపాలకులు