పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ - దేహాదులు

తే. గీ.

ఆత్మ దేహాదులకును వేఱనియు నిరత
సచ్చిదానందలక్షణస్థాయి యనియుఁ
బరమపుంశేషతైకస్వభావవృత్తి
యనియు నెఱిఁగిన యతఁడు సు మ్మాత్మవేది.

28


వ.

ఏతద్ద్రవ్యమె యాత్మకు విజ్ఞానసమాశ్రయమై యుండు నా ద్రవ్య
మాత్మకు దేహ మట్లనె విశ్వమంతయుఁ బరబ్రహ్మకు దేహంబై యుండు
నని ధ్యానం బొనర్చిన యతం డితరాపేక్ష లేక మోక్షంబు నొందు.
క్షరము ప్రధాన మమృత మక్షరము (జీవుం డా)క్షరాత్ములను హరి
యొక్కడె పరిపాలింపుచునుండు. భోక్త భోజ్యము ప్రేరకుండునని
యెఱింగి యందుచేత నమృతత్వంబు నొందు. "క్షరం ప్రధాన మమృతా
క్షరమ్మ"నియెడి యుపనిషద్వాక్యంబు గలదు. మఱియు నొకరుండె
సర్వప్రాణులందు వ్యాపించి యంతరాత్మయై కర్మాధ్యక్షుండై సర్వ
భూతాదివాసుండై సాక్షాద్ద్రష్టయై చిత్పూర్ణుండై కేవలుండై నిర్గుణుండై
యుండునను 'ఏకోదేవ సర్వభూతేషు' అనియెడి యుపనిషద్వా
క్యంబు గలదు. మఱియు నాకారరహితంబై యవ్రణమై యజరమై,
శుద్ధమైన తేజము వెలుంగు నాతేజము కవియు మనీషియు పరిభూ,
స్వయంభూ నామాన్వితంబునునై యనేకకాలంబు లాధాత తథ్యంబు
వలన నర్థంబు లొనర్చునను 'సపర్యగాచ్ఛుక్రమకాయ మవ్రణమ్మ'ను
ఉపనిషద్వాక్యంబు గలదు. మఱియుఁ బెక్కండ్రైన నిత్యులైన
జీవులకు నిత్యుండైన చేతనుండు భగవంతుఁ డొక్కరుండే కామంబు
లిచ్చుచుండు నతని ధీరుండైన బ్రాహ్మణుం డెఱింగి ప్రజ్ఞాశక్తి నిలుపు
కొనవలయు నని పలుకు “నిత్యో నిత్యానామ్” అనియెడి యుపనిష
ద్వాక్యంబు గలదు. మఱియుఁ దత్వత్రయజీవనంబులైన యుపనిష
ద్వాక్యంబులు గలవు.

29

పరబ్రహ్మతత్త్వము

సీ.

తత్వత్రయం బనాఁదగుఁ జిద చిత్పర
                       బ్రహ్మభేదంబునఁ బ్రధిత మగుచుఁ
జిదచిచ్ఛరీరత చెప్పంగఁ దగుఁ బర
                       బ్రహ్మంబె పూర్ణమౌ పరమతత్వ