పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శేషత్వంబులు జీవులకు స్వభావం బది యెఱింగి చేసిన కర్మంబు తన
యది గాదు. కావున విష్ణుప్రీతిగ సత్కర్మం బొనరింపవలయు.
దేహేంద్రియమనఃప్రాణాదులకన్న వేరై సుఖచిద్ఘనుండై యపహతా
శేషపాపచయుండై, విజరుండై, విమృత్యుండై, విశోకుండై, విజిషు
త్సుండై, వితృష్ణుండై సత్యకామత్వాదిగుణసంపన్నుండై సూక్ష్మత్వంబు
నొందియు నాతతచిత్ప్రభం జెంది సర్వాంతర్గతశక్తిత్వంబువలన,
నభేద్యుండు నదాహ్యుండు నక్లేద్యుండు నశోష్యుండునునై, నిత్యశుద్ధ
సుఖానందగుణబ్రహ్మామృతాబ్ది నోలలాడుచు సర్వానందయిత్వ
బ్రహ్మానందశేషత్వలక్షణుండై దేవనరపశుపాదపశరీరాకృతి
భేదంబులు [1]పొందు జీవునికిని వికర్మజనితంబులు [2]కర్మం బనాద్య
విద్యవలనం బుట్టె, నాయనాద్యవిద్య యనాద్యచిదన్వయంబువలన
నయ్యెడు నట్లు జీవుం డవిద్యాకర్మవాసనచే మహదాదిశరీరాంత
వికారకలితానాత్మత్రిగుణప్రథానావృతుండై తత్కృతవిభ్రముండై
యేను దేహుండ నను నహంకారంబు పూని, దేవత్వ నరత్వ గోత్వ
బ్రాహ్మణత్వేశ్వరత్వ భోగిత్వ సిద్ధిత్వ బలత్వ సుఖిత్వంబులు వహించు
కొని, యజనం బొనర్చెద, నిచ్చెదం బ్రమోదించెదనని విమోహంబు
వలనం బలుకుచుఁ బరమాత్మైకధర్మస్వాతంత్ర్యసద్గుణంబులు
తనయం దారోపించుకొని సర్వంబు తనకొఱకే యని చింతించు(చుండు)
కొందఱు సూరిచేతనులు సర్వవ్యాప్తామలానందస్వరూపంబైన పర
బ్రహ్మంబె సర్వానందదాయకంబనియు నితనియందు వర్తించు నఖిలం
బున బ్రకాశించునని(యు) వితర్కింపుచుఁ బరబ్రహ్మామృతాంబుధి
నోలలాడుచు లీలాభోగవిభూతస్థులై రమింపుదురు. త్రిగుణప్రకృతి
లీలావిభూతి, షడ్గుణప్రకృతి భోగవిభూతి. ఇవి రెండును పర
బ్రహ్మాశ్రితంబులు. గగనంబున నభ్రశశిమండలంబులువోలె నధ
రోత్తరభావంబున లీలావిభూతి భోగవిభూతులు మెఱయు. మహా
మాయ యవిద్య నియతి మోహినీప్రకృతి వాసన యన లీలావిభూతి
పరమవ్యోమ పరమధామాది సంజ్ఞలం గలయది భోగవిభూతి. ఈ
రెండువిభూతులు నాత్మలతోఁగూడ భగవచ్ఛేషరూపంబులగుం గానఁ
గర్మంబులు తనవిగా వీశ్వరునివి. చేతనాచేతనాత్మకంబగు విశ్వంబు
విష్ణుశరీరంబునుం గావున తత్ర్కియలు విష్ణ్వధీనంబు లగునని
మఱియు నిట్లనియె.

27
  1. అర్థాన్వయముకొఱకు "పొందు" ఉండవలయును.
  2. కర్మం బన నాద్యవిద్యవలన