పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

అరయఁగ విప్రశాపహతులై పడువారికి విప్రతాడనో
త్కరమున నీల్గువారికిని దగ్ధభుజంగమదష్టవజ్రపా
తరదనఘాతభగ్నులయి తారెడువారికి జహ్నుకన్యకా
సరిదవగాహమోపు ననిశంబును దద్ఘనపాప మాపఁగన్.

210


వ.

అనిన మోహిని యిట్లనియె.

211


క.

అటువంటి దివ్యవాహినిఁ
బటువేగముతోడ నేఁగి పడి మునిగినఁ ద
త్కుటిలాఘంబులు దొలఁగవు
జటిలానీకములు దొలఁగి చనుదురు చేరన్.

212


వ.

అది గావున నేను హరివాసరద్రోహిని, భర్తృపుత్రవినాశినిని, జగ
త్త్రయనిందితను, నన్ను నెట్లు దండించినం దగుదు నేమి సేయుదాన
నని దైన్యంబున నున్న మహేశదివాకరసహితులగు దివ్యులు
రుక్మాంగద పురోహితుని మెల్లన శాంతి నొందించి యిట్లనిరి.

213


వ.

నాకము పాడై యుండన్
వెకుంఠము నిండియుండ వనరుహహితభూ
లోకము శూన్యం బగుటన్
వ్యాకులతం బొంది చేయవలసెన్ మాకున్.

214


వ.

ఏము పంపిన నిమిత్తంబుననే యీమోహిని హరివాసరవ్రతంబు
మాన్ప రుక్మాంగదసన్నిధానంబునకు వచ్చినయది గాని నిజతంత్రం
బున వచ్చినయది గాదు. (రాజు) పునరావృత్తిరహితంబైన పరమ
ధామంబు సత్యంబు నిలుపుకొని చెందె. ఇది యుపకారంబె కావించిన
యది. నీవు సదాచారుండవు. తపస్వివి, సర్వభూతహితుండవు.
మహానుభావులకుఁ జేసిన యప్రియంబేనియుఁ బ్రియంబే యగు. సాంఖ్య
విదులైన మునులకు లభింపని వైభవం బారాజునకుం గలిగె.
ప్రసన్నుండవు కమ్ము. పాదహతులైనవారిని హింసింప నేటికి? అని
విన్నవించిన నిర్జరుల మన్నించి శాంతుఁడై పురోహితుం డిట్లనియె.

215


సీ.

అనిమిషులార! పాపాన్విత యిది భర్తృ
                       దుఃఖప్రదాయిని, దుష్టశీల
స్థావరజంగ మాత్మకమైన లోకత్ర .
                       యంబున దీనికి నధివసింప