పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తుని, దుష్టశిక్షకుని, సప్తవ్యసనాపేతుని, ధర్మాంగదుని నింత చేనె, నిది
వరంబునకుఁ దగునే? దీనిపై దేవతలేని దానవులేని పక్షంబు నిలిపిన
వారినే భస్మంబు సేయుదు. తత్పక్షదోషంబునఁ బక్షపాతియు మహా
పాతకుం డౌనని కోపంబు మోహినిదేహంబుపైఁ బ్రయోగించి దివ్యులు
ప్రార్థించు నంతనే భస్మంబు చేసెనని వసిష్ఠుండు మాంధాతకు నానతి
యిచ్చి మఱియు నిట్లనియె.

206


ఉ.

నాకమనాగ పద్మసదనాకము నాయతభక్తినిష్ఠులౌ
లోకులకుం బ్రశస్తమగు లోకము పాపశరీరులైన యా
లోకులకున్ దినేశసుతలోకము గాని లభింప దీవు సు
శ్లోకుని రాజుభక్తు నరిసూదనుఁ జేసిన చేఁత రిత్తయే?

207

మోహిని పాపఫల మనుభవించుట

సీ.

అని [1]భూమిదేవుఁ డిట్లాడిన నాబోటి
                       నరకంబునకుఁ ద్రోయ నరకవాసు
లందఱు నిందుండ నర్హలే నీవు గు
                       ణాధికు ధర్మాంగదావనీశు
ధర్మజ్ఞు సత్పథస్థాయి దయాళుని
                       గురుభక్తిరతు దానకుశలు బంధు
పక్షు సప్తద్వీపపతి నసిచే నేఁడు
                       సమయింపఁజూచితి సాహసమునఁ


తే. గీ.

గనలి దుర్మదసుతునైన గాసిచేయ
బ్రహ్మహత్యాశతోపమపాతకము ల
భించునని యమ్మహాఋషు లెంచుకొందు
రట్టితత్త్వజ్ఞుఁ జేసితి వౌనె నీకు?

208


వ.

ఇందు నీకు నిష్కృతి గలదే? యని వెడలంద్రోయ రసాతలంబు సొచ్చె,
నారసాతలంబున నాగకుమారులు తర్జించిన లజ్జించి దేవసభకు నేఁగి
మొఱలిడుచు భువనత్రయంబుఁ దిరిగి ముసలదండాదులచే మొత్తులం
బడి భవత్కార్యార్థంబుగా నింత చేసి నొచ్చితి. నాకు గతి యెట్లు
గలిగెడునని పరితపింప.

209
  1. వాయు