పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మత్ప్రాణంబులు నల్మినయది. ఏతత్సమ్మతంబుగా రూపకులశీలసంప
న్నుండగు నీబ్రాహ్మణునికి నిమ్మన నట్లనె నంగీకరించి దానిం
బ్రార్థించి.

147

కాశీరాజు పుత్రికను గౌండిన్యున కిచ్చి వివాహ మొనరించుట

మ.

ఇది నీదాసి యనుగ్రహింపు కృపచే నింతీ! మనోజాత మ
ర్మదబాణంబులఁ దూలి యోర్చితివి తద్రక్షోవిభున్ నింద కా
స్పదమైయుండిన నుండనిమ్ము విలసత్సౌభాగ్యభాగ్యైకసం
పద నీ విపుఁడు భర్తయైన జని సాఫల్యంబు నీ కబ్బదే?

148


సీ.

మత్సుతకును నాకు మద్బాంధవులకు మ
                       దిష్టదైవములకు నీశ్వరివి స
పత్నీత్వదోషసంపత్తి నుండకు మీద్వి
                       జాగ్రణి కిచ్చితి నాత్మజాత
నిది నీకు నిల్లడ యెలమితో మన్నించి
                       దాసిఁగా నేలు మో తల్లి! నీవు
దేహంబుఁ బ్రాణంబుఁ దీఱినయవి నేఁడు
                       తిరుగనిచ్చితివి సందేహ మేల?


తే. గీ.

యనుచు లాలించి పలికిన నాత్మ నుబ్బి
యిద్దఱము నీకుఁ దనయల మింత యేల?
నగరమునఁ బూజ నొందితి జగ మెఱుంగ
నిఖిలభాగ్యంబు లభియించె నృపవరేణ్య!

149


వ.

అష్టమినుండి చతుర్దశిదనుక నేడుదినంబు లుత్సవంబులు సేయవలయు
నృత్తగీతవాద్యనటకీర్తనసమేతంబుగా బలిపూజాదు లర్పింపవలయు
నగరంబు శృంగారింపవలయు నిందున నీకుఁ గల్యాణపరంపరావాప్తి
యగు నన నట్ల కావించి బ్రాహ్మణునకుఁ బరిణయం బొనరించె నంత
దాసదాసీగోమహిషహయకుంజరయానదివ్యవస్త్రాభరణకనక
రత్నాదులతో భటజనంబు గొలువ రాజు రత్నావళి ననిచె. రాక్షసి
కరిణియై కంధరంబున నిడికొని నిజపురంబునకుం దోడ్కొని తెచ్చె.
తద్గృహంబు కుబేరగృహంబునుంబోలెఁ గలితవస్తుసకలసంగ్రహంబై
యుండ సపత్నీద్వయంబుం జూచి యేను దుఃఖింపుచు నుండ బంధు
సఖీజనంబులు చేరి మర్మభేదకంబులగు పరుసనిమాటల నిట్లనిరి.

150