పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


దుష్క్రియలకు మూలంబగుదు. ఏబ్రాహ్మణుండు గోరహితంబుగా
మహిషీగణంబు నేలుకొనువాఁ డెన్నెన్ని బాములం బడు నవి నే నొందుదు.
చిరిఁగిన, యధౌతంబైన దగ్ధంబైన పరులు గట్టినదియైన పటంబుఁ
గట్టుగొని దేవార్చనంబు సేయువాఁ డేగతిం బొందు నాగతిం బొందుదు.
వధూవిలోకనపరదారవిలోకనంబుల నెయ్యది ప్రాపించు నది నాకు
లభించు. సత్కథాప్రసంగంబు సేయునెడ విఘ్నం బాచరించువాఁ డే
లోకంబు నొందు నాలోకంబు నందుదు. పారక్యమందు నజాత
కుసుమంబునఁ జేయువాఁ డెచ్చటనుండు నచ్చట నుండుదు. కంచుకో
పేతయగు విధవయుఁ గంచుకరహితయగు భర్తృమతియు నేజగంబుల
నుండుదు రాజగంబుల నుండుదు. హీనజాతియతండు బ్రాహ్మణ
వేషంబుఁ దాల్చిన, బ్రాహ్మణుండు బ్రాహ్మణచిహ్నంబు లేకయుండిన
నేదుర్గతులం బొందుదు రాదుర్గతులం బొందుదునని పాపరాక్షసి
బోధించిన నంగీకరించి ద్రవ్యలోభరతిలోభంబులు పెనఁగొని
తచ్ఛక్తి వేగంబె తెమ్మని నియోగించిన రాక్షసి చని తెచ్చె నంత.

129


క.

ఘనుఁ డారాక్షసవీరుఁడు
తనుఁ జెఱగొనితెచ్చి మదనతంత్రక్రీడన్
బెనఁగొన వచ్చిన నా నృప
తనయ ప్రియం బొప్పఁ బలికె దనుజునితోడన్.

130


క.

పరిణయము లేని కన్యను
గరిమన్ రతి సల్పఁ బాతకంబని శాస్త్రాం
తరములఁ బల్కిరి ధరణీ
సురవర్యులు వినవె ధర్మసూక్ష్మక్రమముల్.

131


సీ.

అది గాన మద్భాగ్య మట్లయినఁ గానిమ్ము
                       నీకు దోసము లేదు నిశిచరేంద్ర!
కాముకుండవు గాన భూమీశసంగుప్త
                       సౌధస్థలముఁ జొచ్చి శంకలేక
తెచ్చితి నన్ను నుద్వృత్తిమై మొదలనె
                       ధవుఁడు భార్యయును విద్యయు గృహంబు
విత్తంబు కష్టంబు వృద్ధి క్షయంబులుఁ
                       బ్రాపించు దైవకృతంబువలన